చంద్రబాబే నేటికీ మా సీఎం .. అందుకే సీఎం చంద్రబాబు అనే సంబోధిస్తున్నా అన్న గల్లా అరుణ
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు గుంటూరు కార్యాలయానికి వెళ్ళటంతో పార్టీ శ్రేణుల్లో నూతనోత్సాహం నెలకొంది. గుంటూరులోని రాష్ట్ర పార్టీ కార్యాలయం నుంచే కార్యకలాపాలు నిర్వహించేందుకుగాను సోమవారం మొదటిసారిగా చంద్రబాబుకు మహిళలు, పార్టీ నాయకులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. చాలా ఉత్సాహంగా కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇక ఆ కార్యక్రమంలో ఆసక్తికరమైన సంఘటన జరిగింది.

గల్లా అరుణ కుమారి ఆసక్తికర వ్యాఖ్యలు ... అధికారం లేదు అయినా సీఎం చంద్రబాబే అన్న గల్లా
చంద్రబాబు పార్టీ కార్యాలయానికి వెళ్ళటంతో చాలా రోజుల తర్వాత పార్టీ కార్యాలయం నాయకులు, కార్యకర్తలతో కళకళలాడింది. చంద్రబాబును చూసేందుకు పెద్ద ఎత్తున మహిళలు, కార్యకర్తలు తరలివచ్చారు. మంగళగిరిలో నిర్మిస్తున్న ప్రధాన కార్యాలయం అందుబాటులోకి వచ్చే వరకు నిత్యం ఇక్కడ అందుబాటులో ఉంటూ.. అండగా ఉంటానని భరోసా ఇచ్చారు.ఇక ఈ కార్యక్రమంలో ప్రధానంగా గల్లా అరుణ కుమారి మాట్లాడిన మాటలు ఆసక్తికరంగా సాగాయి. ప్రజలు సీఎంగా జగన్ మోహన్ రెడ్డికి పట్టం కట్టినా మీరే మా సీఎం అని ఆమె తన ప్రసంగం అంతా సీఎం చంద్రబాబు అని కొనసాగించటం ఆసక్తికరంగా మారింది.

తన ప్రసంగం అంతా సీఎం చంద్రబాబు అనే సంబోధించిన గల్లా అరుణ కుమారి
గుంటూరులోని టిడిపి కార్యాలయంలో ప్రతిపక్ష నాయకుడు , మాజీ ముఖ్య మంత్రి, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడి సమక్షంలో పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి టిడిపి నాయకురాలు , మాజీ మంత్రి గల్లా అరుణ కుమారి మాట్లాడారు. చంద్రబాబు పట్ల తన అభిమానాన్ని ఆమె తన మాటలతోనే వ్యక్తం చేశారు. ఈ రోజు ఈ కార్యక్రమానికి విచ్చేసిన సీఎం చంద్రబాబు గారు అంటూ ఆమె ప్రసంగాన్ని ప్రారంభించారు. అది విన్న వాళ్ళు ఆమె పొరబాటున అలా అన్నారనుకున్నరేమో అనుకునే లోపే చంద్రబాబును ముఖ్యమంత్రిగా పిలవాలని కోరుకుంటున్నాను, మాజీ ముఖ్యమంత్రిగా కాదు అని ఆమె కావాలనే అలా సంబోధించానని క్లారిటీ ఇచ్చారు. ప్రజా తీర్పు ఏదైనా మాకు మాత్రం సీఎం చంద్రబాబే అన్నారు.

కేబినేట్ సబ్ కమిటీ లోని మంత్రులే అవినీతిపరులు .. దేనికీ భయపడాల్సిన అవసరం లేదు అన్న గల్లా
ఇక తన ప్రసంగం అంతా ఆమె చంద్రబాబును సిఎం అని పేర్కొన్నారు. చాలా మంది మహిళలు , అభిమానులు చంద్రబాబుకే ఓటేసినా ఎందుకు అధికారంలోకి రాలేదు అని ఆవేదన చెందారని చెప్పిన గల్లా అరుణ కుమారి ఇక చాలా మంది అభిమానులు తమకు సీఎం అంటే చంద్రబాబే అని పేర్కొన్నారని చెప్పారు. పోల్ ఫలితాలతో ఎవరూ నిరాశ చెందవద్దని, రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలకు ఉత్సాహంతో పనిచేయాలని ఆమె పార్టీ కార్యకర్తలను కోరారు. దాడులకు భయపడవద్దని , సీఎం చంద్రబాబు బాటలో సాగుదామని చెప్పి ఆమె పడే పడే చంద్రబాబును సీఎం అని పేర్కొన్నారు. టిడిపి పాలనలో అవినీతిపై దర్యాప్తు చేయడానికి కేబినెట్ సబ్ కమిటీ వేశారని కానీ ఆ సబ్ కమిటీలో నియమించిన మంత్రులు అవినీతిపరులు అని అరుణ ఆరోపించారు. దేనికీ భయపడకుండా కుల మతాలకు అతీతంగా టీడీపీ అన్ని అని భావించి ముందుకు సాగి మళ్ళీ సీఎంగా చంద్రబాబును చెయ్యాల్సిన బాధ్యత ఉందని ఆమె పేర్కొన్నారు.
-
పోలవరం ప్రాజెక్ట్ పై కేంద్రానికి మంత్రి విన్నపాలు! -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!!












Click it and Unblock the Notifications