మంగళగిరి టోల్ ప్లాజాలో భారీ అగ్ని ప్రమాదం: లారీ, క్యాష్ కౌంటర్లు పూర్తిగా దగ్ధం
గుంటూరు: జిల్లాలోని మంగళగిరి సమీపంలోని ఖాజా టోల్ ప్లాజా వద్ద గురువారం సాయంత్రం భారీ అగ్ని ప్రమాదం జరిగింది. లారీని క్యాష్ కౌంటర్ వద్ద ఆపి టోల్ ఫీ చెల్లిస్తున్న సమయంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. అంతా చూస్తుండగానే మంటలు క్యాష్ కౌంటర్లకు వ్యాపించాయి.
వెంటనే అప్రమత్తమైన టోల్ ప్లాజా సిబ్బంది అక్కడ్నుంచి పరుగులు తీశారు. లారీ డ్రైవర్ కూడా వాహనం నుంచి దిగి దూరంగా పరుగెత్తాడు. దీంతో పెద్ద ప్రమాదం తప్పింది. లారీ పూర్తిగా మంటల్లో కాలిపోయింది. లారీ తమిళనాడుకు చెందినదిగా గుర్తించారు. లారీ టైర్ ఒక్కసారిగా పేలడంతో మంటలు చెలరేగినట్లు తెలుస్తోంది. ఈ ప్రమాదంలో రెండు క్యాష్ కౌంటర్లు కూడా పూర్తిగా దగ్ధమయ్యాయి.

సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది.. వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. రెండు ఫైరింజన్లతో మంటలను ఆర్పివేశారు. కాగా, రూ. 20 లక్షల ఆస్తి నష్టం వాటిల్లినట్లు టోల్ గేట్ నిర్వాహకులు చెబుతున్నారు.
ప్రస్తుతం యథావిధిగా రాకపోకలు కొనసాగుతున్నాయి. ప్రమాద ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కర్ఫ్యూ నేపథ్యంలో టోల్ ప్లాజా వద్ద రాకపోకలు తక్కువగా ఉండటంతో పెద్ద ప్రమాదం తప్పినట్లయింది.
-
రోజూ గుప్పెడు గింజలు తినండి.. షుగరు, బీపీ పూర్తిగా కంట్రోల్...!! -
ఎట్టకేలకు రైతుల ఖాతాల్లో నిధుల జమ, ఫలించిన నిరీక్షణ..!! -
AP Inter Results: ఏపీలో ఇంటర్ ఫలితాల ముహూర్తం ఫిక్స్, అఫీషియల్..!! -
బుమ్రా, హాజెల్ వుడ్.. నాకు ఎవడైనా ఒక్కటే: వైభవ్ సూర్యవంశీ -
SRH కొంపముంచిన క్లాసెన్ జిడ్డు బ్యాటింగ్ -
మెగాస్టార్ని ఇండియాలో హయ్యెస్ట్ రెమ్యునరేషన్ హీరోగా మార్చిన మూవీ ఇదే..! -
వారి ఖాతాల్లో రూ 20 వేల జమ, ప్రభుత్వం నిర్ణయం - అర్హతలు.. మార్గదర్శకాలు..!! -
వారి గ్రీన్ కార్డులు అవుట్ -
కెరీర్ లోనే ఫస్ట్ ప్లాఫ్.. ఎలా తట్టుకుంటున్నావ్ అన్నా..!! -
పాకిస్థాన్ లోనే ఫాస్టెస్ట్ ట్రైన్ ఇదేనట.. స్పీడ్ చూస్తే మాత్రం.. మన ప్యాసింజర్ ట్రైన్స్ నయం..! -
US Visa: స్లాట్లు ఓపెన్. కానీ ప్రయాణం సేఫ్ కాదు! -
పాకిస్థాన్ కు ఎగిరి గంతేసే వార్త.. ఒకేసారి రూ. 41,500 కోట్లు సాయం అందింది..!!












Click it and Unblock the Notifications