మోడీని చూసి ప్యాంటు తడుపుకునే బ్యాచ్ అవసరమా ? వైసీపీకి ఇంకో గొర్రెను గెలిపిస్తారా : లోకేష్ ధ్వజం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తిరుపతి పార్లమెంటు స్థానానికి జరగనున్న ఉప ఎన్నికల పోరులో ప్రచార పర్వం వాడీవేడిగా సాగుతోంది. అధికార, ప్రతిపక్ష పార్టీలు ఒకరిని మించి ఒకరు విమర్శనాస్త్రాలు సంధిస్తూ ఎన్నికల ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు. తిరుపతి పార్లమెంటు ఉప ఎన్నికల ప్రచారంలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ వైసీపీ పాలనపై నిప్పులు చెరిగారు.

అటువైపు ఆలీబాబా దొంగలు .. ఇటు ప్రజల కోసం పోరాడే పనబాక లక్ష్మి
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి లోక్సభలో 21 మంది ఎంపీలు, రాజ్యసభలో ఆరుగురు ఎంపీలు ఉండి ఏం చేశారని లోకేష్ ప్రశ్నించారు. వైసీపీ పాలన పై ధ్వజమెత్తిన లోకేష్ విశాఖ ఉక్కు సాధించారా.. హోదా తెచ్చారా .. అంటూ నిలదీశారు. అటువైపు ఆలీబాబా దొంగలు నిలబడ్డారు ఇటు ప్రజల కోసం పోరాడే పనబాక లక్ష్మి ఉన్నారు. ఈ ధర్మ పోరాటంలో సైకిల్ కి ఓటేసి తెలుగువారి ఆత్మ గౌరవాన్ని కాపాడాలని లోకేష్ పిలుపునిచ్చారు.

జగన్ ప్రభుత్వాన్ని జెసిబి ప్రభుత్వంగా అభివర్ణించిన లోకేష్
చిత్తూరు జిల్లా ఉప ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న లోకేష్ వరదయ్యపాలెంలో జరిగిన బహిరంగ సభలో జగన్ ప్రభుత్వాన్ని జెసిబి ప్రభుత్వం గా అభివర్ణించారు . జె అంటే జగన్ టాక్స్, సి అంటే కరెక్షన్ , బి అంటే బాదుడు అంటూ జగన్ పాలనపై ఆయన నిప్పులు చెరిగారు. తిరుపతి ఉప ఎన్నికల ప్రచార సభలో ప్రభుత్వ పథకాల పేరుతో ఒక చేత్తో రూ.10 ఇచ్చి మరో చేత్తో రూ.100 లాక్కుంటున్నారు అంటూ జగన్ పై నిప్పులు చెరిగారు. పార్లమెంట్ లో వైసీపీ ఎంపీలు గొర్రెల మంద గా వ్యవహరిస్తున్నారన్న లోకేష్, పార్లమెంటుకు ఇంకో గొర్రెను పంపించటం అవసరమా అంటూ ప్రశ్నించారు.

టీడీపీ ముగ్గురు ఎంపీలు సింహాల్లా పోరాటం చేస్తున్నారు
తిరుపతి అభివృద్ధికి వైసీపీ పాలనలో చేసింది ఏంటి అని ప్రశ్నించారు లోకేష్. తిరుపతిలో ఐఐటీ, ఐఐఎస్ఈఆర్ , విమానాశ్రయ విస్తరణ, స్మార్ట్ సిటీ గురించి ఏనాడైనా మాట్లాడారా? ఒక్క రూపాయి తెచ్చారా అంటూ నారా లోకేష్ ప్రశ్నించారు. తెలుగుదేశం పార్టీకి పార్లమెంటులో ముగ్గురు ఎంపీలు ఉన్న సింహాల్లా గర్జిస్తున్నారని, సమస్యలపై పోరాడుతున్నారని పేర్కొన్నారు. ప్రత్యేక హోదా, విశాఖ ఉక్కు ,పోలవరం, విశాఖ రైల్వేజోన్ తదితర అంశాలపై కేంద్రం నిలదీసేది తెలుగుదేశం పార్టీ ఎంపీలేనని నారా లోకేష్ పేర్కొన్నారు.

కేంద్రం ఏం చెబితే ఆ మేరకు తలాడించే గొర్రెల మందలో ఇంకో గొర్రె చేరితే ఏం లాభం
పార్లమెంట్లో ప్రశ్నించే గొంతు కావాలని, మోడీని చూసి ప్యాంటు తడుపుకునే బ్యాచ్ అవసరమా అంటూ ప్రశ్నించిన లోకేష్ , కేంద్రం ఏం చెబితే ఆ మేరకు తలాడించే గొర్రెల మందలో ఇంకో గొర్రె చేరితే లాభం ఏమైనా ఉంటుందా అని అడిగారు.
అవినీతి రాజకీయాలతో దోపిడీ పాలన సాగిస్తున్న జగన్మోహన్ రెడ్డి ని గద్దె దించడం కోసం ఉప ఎన్నిక తీర్పు ద్వారా నాంది పలకాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. తెలుగువారి ఆత్మగౌరవాన్ని ఢిల్లీలో తాకట్టు పెట్టే వైసీపీ ఎంపీలు కావాలో .. ప్రగతి కోసం పాటుపడే పనబాక లక్ష్మి కావాలో ప్రజలే నిర్ణయించుకోవాలని నారా లోకేష్ అన్నారు.

పార్లమెంట్లో పడుకుని జగన్ రెడ్డి పాద సేవ చేసే ఎంపీ కావాలో.. మీ ఇంటి లక్ష్మి కావాలో తేల్చుకోండి
ఒక మహిళగా ఇంట్లో ఆడవాళ్లు పడే కష్టాన్ని చూసిన పనబాక లక్ష్మి, ఎంపీగా ప్రజల సమస్యల పరిష్కారానికి కూడా కీలకంగా పనిచేసిన మహిళ కాబట్టి పార్లమెంటులో మీకు సేవ చేసే అవకాశం ఉందన్నారు. ప్రజలకు సేవ చేసే మీ ఇంటి లక్ష్మీ కావాలో .. పార్లమెంట్లో పడుకుని జగన్ రెడ్డి పాద సేవ చేసే ఎంపీ కావాలో మీరే తేల్చుకోండి అంటూ లోకేష్ ఎన్నికల ప్రచారంలో వైసీపీ ని టార్గెట్ చేశారు.
-
దక్షిణాది రాష్ట్రాలకు కేంద్రం అన్యాయం: సీఎం రేవంత్ రెడ్డి -
కేంద్రానికి కవిత షాకింగ్ అల్టిమేటం.. ఆ విషయంలో పోరాటమే! -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!!












Click it and Unblock the Notifications