టూనా చేపల నూనె డబ్బాల మధ్య, క్యాప్సుల్స్.: శంషాబాద్ ఎయిర్పోర్టులో 1.24 కేజీలో గోల్డ్ సీజ్
హైదరాబాద్: అధికారులు విధాలుగా తనిఖీలు చేపట్టి పట్టుకుంటున్నా.. అక్రమార్కులు బంగారం విలువైన ఆభరణాలు తరలించేందుకు కొత్తదారులు వెతుకుతున్నారు. అంతకుమించి ఎత్తులు వేస్తున్న అధికారులు వారి ఆటలను కట్టిస్తున్నారు. తాజాగా, శంషాబాద్ విమానాశ్రయంలో బంగారం అక్రమంగా రవాణా చేస్తున్న నిందితులను పట్టుకున్నారు.
నిందితుల వద్ద నుంచి రూ. 66.24 లక్షల విలువైన 1.24 కిలోల బంగారాన్ని కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. పక్కా సమాచారంతోనే నిందితులను అదుపులోకి తీసుకున్నట్లు అధికారులు తెలిపారు.

మంగళవారం తెల్లవారుజామున 02.55 గంటలకు శంషాబాద్ విమానాశ్రయంలో దుబాయ్ నుంచి వచ్చిన ప్రయాణికుడి నుంచి 840 గ్రాముల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. దీని విలువ రూ. 51.24 లక్షలుగా ఉంటుందని కస్టమ్స్ ఎయిర్ ఇంటెలిజెన్స్ అధికారులు వెల్లడించారు. బంగారాన్ని పేస్టుగా చేసి మూడు క్యాప్సల్స్ రూపంలో తరలించేందుకు నిందితుడు యత్నించాడని తెలిపారు.
మరో వ్యక్తి నుంచి కూడా అక్రమంగా తరలిస్తున్న బంగారాన్ని అధికారులు సీజ్ చేశారు. మంగళవారం ఉదయం 03.45 గంటలకు దుబాయ్ నుంచి వచ్చిన వ్యక్తి నుంచి 233 గ్రాముల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. దీని విలువ సుమారు రూ. 14.23 లక్షలు ఉంటుందని అధికారులు తెలిపారు. టూనా చేపల నూనె డబ్బాల మధ్య పెట్టుకుని ఈ బంగారాన్ని తరలించేందుకు నిందితుడు యత్నించాడని చెప్పారు.
-
Gold: భారీగా పెరిగిన బంగారం ధరలు. పసిడి మార్కెట్లో పూనకాలు -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
MMTS సర్వీసుల సంఖ్య పెంపు..? సీఎం రేవంత్ గుడ్ న్యూస్..! -
తెలంగాణలో పెట్రోల్, గ్యాస్ కొరత లేదు: క్లారిటీ ఇచ్చిన కమిషనర్! -
Red Alert: వడగళ్ల వాన, రాబోయే రెండు గంటల్లో భారీ వర్షం -
ఎల్బీ నగర్ - హయత్ నగర్ డబుల్ డెక్కర్ ఎలివేటెడ్ కారిడార్! -
హైదరాబాద్ To బ్యాంకాక్.. తక్కువ ధరకే ఫారిన్ టూర్.. బీచ్ లో చిల్ అవుతూ.. -
హైదరాబాద్ లో పెట్రోల్ బంకుల వద్ద అదేం రష్ రా అయ్యా- సిటీలో పెట్రోల్ కొరత? -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
శర్వానంద్ 'బైకర్' ఫస్ట్ రివ్యూ.. దేశంలోనే తొలి ప్రయత్నం.. -
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..!












Click it and Unblock the Notifications