తెలంగాణలో మరింత తగ్గుముఖం: నిన్నటి కన్నా తక్కువ.. ఐదుగురు మృతి
కరోనా కేసులు క్రమంగా తెలుగు రాష్ట్రాల్లో తగ్గుముఖం పడుతున్నాయి. గత 24 గంటల్లో తెలంగాణ రాష్ట్రంలో 1,05,186 కరోనా పరీక్షలు చేశారు. వీరిలో 784 పాజిటివ్ కేసులు వచ్చాయి. అత్యధికంగా జీహెచ్ఎంసీ పరిధిలో 89 కొత్త కేసులు రాగా, నల్గొండ జిల్లాలో 71 మందికి కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయింది. అత్యల్పంగా నారాయణ్ పేట్ జిల్లాలో రెండు కేసులు వెలుగు చూశాయి.
1,028 మంది కరోనా నుంచి కోలుకున్నారు. వైరస్ సోకిన ఐదుగురు చనిపోయారు. ఈ మరణాలతో కలిపి తెలంగాణలో మొత్తం 3,703 మంది కరోనాతో కన్నుమూశారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 6,28,282 పాజిటివ్ కేసులు నమోదు కాగా 6,13,124 మంది కోలుకున్నారు. ఇంకా 11,455 మంది చికిత్స పొందుతున్నారు.
వేసవిలోనే కరోనా వైరస్ ప్రభావం ఎక్కువగా ఉంటోంది. గతేడాది సమ్మర్లో కరోనా ఇంపాక్ట్ ఎక్కువగానే ఉంది. ఈ సారి సెకండ్ వేవ్ వల్ల యువత పిట్టల్లా రాలిపోయారు. థర్డ్వేవ్ పిల్లలకు అని ప్రచారం జరుగుతోంది. వచ్చే నెలలో అని నిపుణులు చెబుతున్నారు. దీంతో ఆందోళన నెలకొంది. మరోవైపు వచ్చే ఏడాది సమ్మర్లో ఫోర్త్ వేవ్ అని కూడా అంటున్నారు. దీంతో కరోనా 5,6 ఏళ్లు ఉంటుందని అర్థం చేసుకోవచ్చు.
వానకాలం రావడంతో ఫంగస్ ఇంపాక్ట్ తగ్గుతుందని వైద్యులు సూచిస్తున్నారు. ఇప్పటివరకు బ్లాక్ ఫంగస్ ఇంపాక్ట్ కనిపించింది. మొత్తానికి కరోనాతో కలిసి బతకాల్సిందే.. అందుకోసం విధిగా మాస్క్ ధరించి.. శానిటైజర్ రాసుకుంటూ కాలం వెళ్లదీయాల్సిందే.