విషాదం: హాస్టల్ భవనంపైనుంచి పడి ఇంజినీరింగ్ విద్యార్థిని మృతి
హైదరాబాద్: నగరంలోని వనస్థలిపురం పరిధిలో విషాద ఘటన చోటు చేసుకుంది. హాస్టల్ భవనంపై నుంచి పడి ఓ ఇంజినీరింగ్ విద్యార్థిని మృతి చెందింది. బీఎన్ రెడ్డినగర్లోని జరిగిన ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. వనపర్తికి చెందిన 21 ఏళ్ల రమ్య ఇబ్రహీంపట్నంలోని శ్రీదత్త ఇంజినీరింగ్ కాలేజీలో తృతీయ సంవత్సరం చదువుతోంది. ఆమె తండ్రి శోభన్ రెడీమిక్స్ వాహనం డ్రైవర్గా పనిచేస్తున్నారు. అక్కడి నుంచి కాలేజీ దూరంగా ఉండటంతో కొంతకాలంగా బీఎన్ రెడ్డినగర్ లోని లక్ష్మీదుర్గా ఉమెన్స్ హాస్టల్ లో ఉంటూ చదువుకుంటోంది.

కాగా, శనివారం రాత్రి హాస్టల్ రెండో అంతస్తుపైన ఉన్న రెయిలింగ్ పై కూర్చుని స్నేహితులతో మాట్లాడుతోంది. అయితే, ఒక్కసారిగా అదుపుతప్పి వెనక్కి పడిపోయింది. దీంతో ఆమె తలకు తీవ్రగాయాలయ్యాయి. వెంటనే ఆమెను స్థానిక ఆస్పత్రికి తీసుకెళ్లారు. ఆస్పత్రి చికిత్స పొందుతూ రమ్య మరణించింది.
కూతురు మరణవార్త విని ఆమె కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు చేస్తున్నారు.
-
హైదరాబాద్ బిర్యానీ లవర్స్కు బ్యాడ్ న్యూస్.. వెయిటింగ్ తప్పదు! వీడియో -
హైదరాబాద్కు బుల్లెట్ ట్రైన్.. శంషాబాద్ మెట్రోతో అనుసంధానం! -
ప్రయాణీకులకు TGSRTC గుడ్ న్యూస్, ఛార్జీల తగ్గింపు..!! -
బెంగళూరు 'విద్యార్థి భవన్' మూసివేత..! 'బెన్నె మసాలా దోశ' ప్రియులకు బిగ్ షాక్.. -
హిందూ దేవుళ్లు అంటే లెక్కలేదా.. విద్యార్ధిపై స్కూల్ ప్రిన్సిపల్ దాష్టికం -
ఇన్నాళ్లు ఆ విషయం దాచిపెట్టా - కేటీఆర్ -
ఉగాది నుంచి కన్యారాశి, సింహరాశి వారి జాతక ఫలం -
నిర్మలమ్మ వరాలు: మినిమం బ్యాంక్ బ్యాలెన్స్ పై సంచలన నిర్ణయం -
మెగాస్టార్కి బహిరంగంగా క్షమాపణలు చెప్పిన సీఎం.. -
విశాఖ టు బెంగళూరు వయా తిరుపతి వందేభారత్ స్లీపర్ రెడీ - రూట్ , ముహూర్తం..!! -
ఏపీలో భారీగా మద్యం ధరల తగ్గింపు, ఏ బ్రాండ్ ఎంత..!! -
ఢిల్లీలో జగన్ రూటు మారిందా, పార్లమెంట్ సాక్షిగా - కీలక మలుపు..!!












Click it and Unblock the Notifications