టీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు ఎర కేసు: సీవీ ఆనంద్ నేతృత్వంలో సిట్ ఏర్పాటు
హైదరాబాద్: తెలంగాణలో కలకలం రేపిన టీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు ఎర కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసు విచారణకు ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్) ఏర్పాటు చేస్తూ రాష్ట్ర హోంశాఖ కార్యదర్శి రవి గుప్త ఉత్తర్వులు జారీ చేశారు. హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ ప్రత్యేక దర్యాప్తు బృందానికి నేతృత్వం వహించనున్నారు.
నల్గొండ ఎస్పీ రెమా రాజేశ్వరి, సైబరాబాద్ నేర విభాగం డీసీపీ కల్మేశ్వర్, నారాయణపేట ఎస్పీ వెంకటేశ్వర్లు, రాజేంద్రనగర్ ఏసీపీ గంగాధర్, శంషాబాద్ డీసీపీ జగదీశ్వర్ రెడ్డి, మొయినాబాద్ సీఐ లక్ష్మీనారాయణ సిట్లో సభ్యులుగా నియమించారు.

కాగా, టీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు ఎర కేసులో దర్యాప్తును కొనసాగించడానికి మొయినాబాద్ పోలీసులకు హైకోర్టు మంగళవారం అనుమతి మంజూరు చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే కేసు దర్యాప్తును వేగవంతం చేసేందుకు ప్రభుత్వం చర్యలకు ఉపక్రమించింది.
ఈ క్రమంలో నిందితులను ప్రత్యేక దర్యాప్తు బృందం ఆధ్వర్యంలో ప్రశ్నించనున్నారు. నిందితులు పలువురు ప్రముఖుల పేర్లు ప్రస్తావించడంతో సిట్ దానిపై ప్రత్యేక దృష్టిని సారించే అవకాశం ఉంది. ఇప్పటికే నిందితుల ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకుని ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబోరేటరికీ పంపించారు.
ప్రధాన నిందితుడు రామచంద్రభారతి నకిలీ ఆధార్, పాన్, డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉన్నారని బంజారాహిల్స్ పీఎస్లో మరో కేసు తాజాగా, నమోదైంది. వీటిపైనా సిట్ అధికారులు దర్యాప్తు చేపట్టనున్నారు. టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో రామచంద్రభారతితోపాటు సింహయాజి, నందకుమార్లను కూడా పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే.
-
సమ్మర్ లో ఈ హిల్ స్టేషన్ కు వెళ్తే.. మళ్లీ తిరిగి రావాలనిపించదు..! -
Praful Hinge: తొలి మ్యాచ్, తొలి ఓవర్లోనే అద్భుతం-చరిత్ర సృష్టించిన హైదరాబాద్ కొత్త బౌలర్..! -
Health Insurance: తక్కువ ప్రీమియం.. పెద్ద మోసం! -
అలా చేస్తే శాశ్వతంగా నష్టపోతాం -
అతిపెద్ద నిర్ణయాన్ని తీసుకోబోతున్నాం- తేల్చి చెప్పిన ప్రధాని మోదీ -
కటౌట్ కు తగ్గ పర్ఫెక్ట్ ఫిల్మ్- టైటిల్ గూస్ బంప్స్: విజువల్ వండర్ -
రాజ్యసభకు టీడీపీ, బీజేపీ నుంచి ఊహించని అభ్యర్దులు- జనసేన నుంచి ఆయనే..!! -
ఒంటి పూట బడుల వేళల్లో మార్పు, ఇక నుంచి..!? -
అండగా నిలిచిన భారత్ కు థ్యాంక్స్: ఇరాన్ సంచలన ప్రకటన -
మూడేళ్లకోసారి వచ్చినా.. పెట్టిన 150 రూపాయలకు న్యాయం చేస్తావ్ అన్నా.. -
రేషన్ సరఫరా లో కీలక మార్పులు, తాజా మార్గదర్శకాలు..!! -
దేశవ్యాప్తంగా 14 అర్ధరాత్రి నుంచి పెట్రోల్ ధరలు పెంపు..? ఏఏ నగరాల్లో ఎంత పెరుగుతుంది..?












Click it and Unblock the Notifications