సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో విధ్వసం - ఆగ్నిపథ్ ఆందోళనలు: రైళ్లకు నిప్పు -అదుపు తప్పిన పరిస్థితి..!!
అగ్నిపథ్ ఆందోళనలతో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో పరిస్థితి అదుపు తప్పింది. నిరసన కారులతో కర్రలతో స్టేషన్ లోకి ప్రవేశించారు. పార్శిల్ బాక్సులు రైలు పట్టాలపై వేసారు. వాటికి నిప్పు పెట్టారు. అగ్నిపథ్ నిర్ణయం ఉప సంహరించుకోవాలని నినాదాలు చేసారు. దేశ వ్యాప్తంగా సాగుతున్న ఆందోళనలు ఇప్పుడు సికింద్రాబాద్ కు విస్తరించాయి. పెద్ద ఎత్తున ఆందోళన కారులు స్టేషన్ లోకి చేరటంతో.. పరిస్థితి ఉద్రిక్తం గా మారింది. పెద్ద ఎత్తున పోలీసు బలగాలు అక్కడకు చేరుకున్నాయి. రైళ్ల రాకపోకలు నిలిచిపోయాయి. మూడు రోజులుగా దేశ వ్యాప్తంగా ఆందోళనలు కొనసాగుతున్నాయి.
కేంద్రం సైతం దీని పైన ఇప్పటికే వివరణ ఇచ్చింది. అటు బీహార్ లోనూ రైలుకు నిప్పు పెట్టి ఆందోళనలు కొనసాగుతున్నాయి. రెండు గంటలుగా విధ్వంసం కొనసాగుతోంది. స్టేషన్ లోని లైట్లు...ఫర్నీచర్ ను ధ్వంసం చేస్తున్నారు.

వందల మంది ఒకే సారి స్టేషన్ లోకి చేరుకోవటం.. వస్తూనే విధ్వంసానికి పాల్పడటంతో ఆర్పీఎఫ్ సిబ్బందికి సైతం వారిని నియంత్రించటం కష్టంగా మారింది. ముఖాలకు ముసుగులు వేసుకొని.. స్టేషన్ లోని సీసీ కెమేరాలను సైతం ధ్వంసం చేసారు. ప్లాట్ ఫాంల పైన ఉన్న స్టాల్స్ ను ధ్వంసం చేసారు. నిలిచి ఉన్న రైలు బోగీల్లోనూ నిప్పు పెట్టారు.
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో విధ్వసం - ఆగ్నిపథ్ ఆందోళనలు: అదుపు తప్పిన పరిస్థితి#Hyderabad #Secunderabad#Telangana pic.twitter.com/Wkf5HXNLfP
— oneindiatelugu (@oneindiatelugu) June 17, 2022
ప్లాట్ ఫాంలపైన ఉన్న స్టాల్స్ పూర్తిగా ధ్వంసం చేసారు. రెండు గంటల పాటు విధ్వంస కాండ కొనసాగింది. రెండు రైలు బోగీలు పూర్తిగా దహనమయ్యాయి. రైళ్ల పైన రాళ్లు విసరటంతో ప్రయాణీకులు బయటకు పరుగులు తీసారు. పలు బోగీలు అగ్నికి ఆహుతయ్యాయి. సికింద్రాబాద్ చేరుకోవాల్సిన రైళ్లు ఎక్కడికక్కడే నిలిపివేసారు. ఊహించని విధంగా జరిగిన దాడితో అందరూ షాక్ అయ్యారు. ఆగ్నపథ్ రద్దు చేసి ఆర్మీ పరీక్షలు కొనసాగించాలని నినాదాలు చేసారు. పెద్ద రాళ్లతో రైళ్ల కిటికీలను ధ్వసం చేసారు. ప్రయాణీకులు లోపలే ఉన్నా..దాడులు చేసారు.
దీంతో.. ప్రయాణీకులు భయంతో పరుగులు తీసారు. స్టేషన్ వద్ద ఆర్టీసీ బస్సుల అద్దాలను సైతం పగుల కొట్టారు. పోలసులకు సమాచారం ఇచ్చినా..వారొచ్చే లోపే జరగాల్సిన విధ్వసం జరిగిపోయింది. వారిని నియంత్రించేందుకు స్టేషన్ లో విధుల్లో ఉన్న రక్షణ సిబ్బంది అడ్డుకొనే ప్రయత్నం చేసినా..సాధ్యపడలేదు. తాము ఎంతో కాలంగా ఆర్మీ పరీక్షల కోసం ప్రయత్నాలు చేసి..వేచి చూస్తుంటే..తాజాగా తీసుకున్న నిర్ణయంతో తాము నష్టపోతున్నామని అభ్యర్ధులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రైల్వే స్టేషన్ వద్దకు పెద్ద ఎత్తున ఫైర్ ఇంజన్లు చేరుకున్నాయి. మంటలను అదుపు చేసే ప్రయత్నం చేస్తున్నాయి.
-
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
ఇరాన్ ను లేపేద్దాం రండి: ప్రపంచ దేశాలకు నెతన్యాహు పిలుపు -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
విజయ్ సంచలనం.. టీవీకే అభ్యర్థుల ఫుల్ జాబితా విడుదల.. -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
India Post GDS 2nd merit list 2026: పోస్టల్ జాబ్స్ సెకండ్ మెరిట్ లిస్ట్ పై అప్డేట్..!












Click it and Unblock the Notifications