ఏం లాక్డౌనో ఏమో..? బిర్యానీ ధరకు రెక్కలు... డబుల్ రేటవడంతో గుండె గుబేల్
హైదరాబాదీ బిర్యానీ అని చెబితే చాలు నోరు ఊరిపోతుంది. భాగ్యనగరంలో గల్లీ గల్లీలో వెరైటీ బిర్యానీ లభిస్తోంది. ఊరు/ ఇతర ప్రాంతాల నుంచి వచ్చినవారు హైదరాబాద్ బిర్యానీ తినందే వెళ్లరు. అందుకే ఇక్కడ బిర్యానీకి డిమాండ్ ఎక్కువగా ఉంటుంది. ఇక లాక్డౌన్ వల్ల బిర్యానీకి మరింత గిరాకీ పెరిగింది. మధ్యాహ్నం నుంచి రెస్టారెంట్లు, హోటళ్లు బంద్ అవుతుండడంతో చాలా మంది ఆన్లైన్లో ఆర్డర్ చేసుకుని మరీ ఇంటికి తెప్పించుకుని లాగించేస్తున్నారు.

బిర్యానీ ధరకు రెక్కలు
లాక్ డౌన్ పేరుతో బిర్యానీ ధరలకు రెక్కలొచ్చాయి. రెస్టారెంట్లు అధికంగా బిర్యానీ ధరల్ని పెంచేశారు. ట్యాక్సులు..డెలివరీ చార్జీలు అంటూ బిర్యానీల బిల్లులు పెంచేస్తున్నారు. దీంతో బిర్యానీ తినాలనే కోరికతో ఆర్డర్ చేసుకుంటే వచ్చిన భిల్లు చూస్తే మాత్రం గుండెలు గుబేల్ మంటోంది. కొత్తగా హ్యాండ్లింగ్, ప్యాకేజింగ్ ఛార్జీల పేరుతో వసూళ్లు చేస్తున్నట్లుగా తెలుస్తోంది.

రూ.265 నుంచి..
హైదరాబాద్కు చెందిన ఓ వ్యక్తికి హోటల్కు వెళ్లి బిర్యానీ తినటం అలవాటు. బిర్యానీ అంటే అంత ఇష్టం మరి. దానికి బిల్లు రూ.265 చెల్లించేవాడు లాక్ డౌన్ లేని సమయంలో. కానీ లాక్ డౌన్ తో హోటల్ కెళ్లి తిని ఇంటికి వచ్చేసరికి లాక్ డౌన్ సమయం దాటిపోతుంది. దీంతో రిస్క్ ఎందుకులే అని ఆర్డ్ చేసినమరీ తెప్పించుకున్నాడు. గతంతో రూ.265 ఉన్న మటన్ బిర్యానీ ధర ఒక్కసారిగా దాదాపు డబుల్ అయిపోయింది.

రూ.405..
లాక్ డౌన్ వల్ల హోటల్ కు వెళ్లికుండా ఆన్లైన్లో ఆర్డర్ చేయాలనుకున్నాడు. రూ.405గా రేటు చూపించింది. బిర్యానీ డెలివరీకి అదనంగా మరో రూ.22, ఇతర ఛార్జీల కింద రూ.40. మొత్తం బిల్లు రూ.467 కట్టాల్సి వచ్చింది. రెస్టారెంట్ (ప్యాకేజ్ చార్జీలు, జీఎస్టీలు, డెలివరీ చార్జీలు) మొత్తం అదనంగా మొత్తం రూ.202 చెల్లించుకున్నాడు. కేవలం బిర్యానీకి మాత్రమే కాదు ఏ ఇతర ఆహార పదార్థాలకు కూడా ప్యాకేజింగ్ ఛార్జీలు, పన్నులు అంటూ వసూళ్ల మీద వసూళ్లు చేసి వినియోగదారుల జేబులు ఖాళీ చేస్తున్నారు.

అడ్డగోలుగా దోపిడీ
అదనపు వసూళ్లకు సంబంధించి స్పష్టమైన మార్గదర్శకాలను ప్రభుత్వం రూపొందించలేదు. దీంతో హోటళ్లు, రెస్టారెంట్లు ఇలా దోపిడీకి పాల్పడుతున్నది. ఇలాంటి వసూళ్లకు సంబంధించి వినియోగదారుల ఫోరంలో ఫిర్యాదు కూడా చేయవచ్చు. బిల్లులు అధికంగా వేస్తే కస్టమర్లు వెంటనే వినియోగదారుల మండలి లేదంటే తూనికలు కొలతలు, జిల్లా వినియోగదారుల కమిషన్లో ఫిర్యాదు చేయాలని నిపుణులు సజెస్ట్ చేస్తున్నారు.
-
నో గ్యాస్.. హైదరాబాద్ హాస్టల్స్ లో టిఫిన్స్ బంద్.. -
హైదరాబాద్ లో సెకండ్ కేబుల్ బ్రిడ్జ్.. ఎక్కడో తెలుసా..? -
హైదరాబాద్ లో హాలీవుడ్.. నెట్ఫ్లిక్స్ ఐలైన్ స్టూడియో ప్రారంభించి సీఎం రేవంత్ వ్యాఖ్యలు! -
హైదరాబాద్ లో మరో అద్దిరిపోయే రైల్వే స్టేషన్ -
సాగర్ మీదుగా హైదరాబాద్ టు విజయవాడ ఎక్స్ ప్రెస్ వే -
బెంగళూరు 'విద్యార్థి భవన్' మూసివేత..! 'బెన్నె మసాలా దోశ' ప్రియులకు బిగ్ షాక్.. -
కేంద్రం ముందు అయిదు ప్రతిపాదనలు పెట్టిన కేటీఆర్ -
పెళ్లైన హీరోతో ఎఫైర్ వల్ల సినిమాల్లో బ్యాన్.. ఎవరా డ్రీమ్ గర్ల్ ?? -
ముఖానికే కాదు అక్కడ కూడా మేకప్ వేసుకోవాలన్నారు..! -
Work From Home ఇచ్చేశారు. ప్రభుత్వం, ఐటీ దిగ్గజాల కీలక ప్రకటన! -
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు












Click it and Unblock the Notifications