వీహెచ్ మళ్లీ వేశాడు: ముందు నా విగ్రహాం రిలీజ్ చేయ్, కేసీఆర్కు సవాల్
తెలంగాణ కొత్త సచివాలయానికి డాక్టర్ బీఆర్ అంబేద్కర్ పేరు పెడతామని తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. దీనిని చాలా మంది స్వాగతిస్తున్నారు. కాంగ్రెస్ సీనియర్ నేత వీ హనుమంతరావు కూడా రియాక్ట్ అయ్యారు. కానీ సీఎం కేసీఆర్ నిఖార్సైన అంబేద్కర్ వాదీ అవాలంటే అంటే గతంలో జరిగిన ఘటనను గుర్తుచేశారు.

ఆదర్శమే..
సీఎం కేసీఆర్ తీసుకున్న నిర్ణయం దేశానికే ఆదర్శమని వీహెచ్ పేర్కొన్నారు. లాకప్ లో ఉంచిన తన అంబేద్కర్ విగ్రహాం ఎప్పుడు విడుదల చేస్తారో చెప్పాలని డిమాండ్ చేశారు. విడుదల చేసినప్పుడే కేసీఆర్ నిజమైన అంబేద్కర్ వాది అవుతారని కుండబద్దలు కొట్టారు. లేదంటే కారని పేర్కొన్నారు.

ఇదీ విషయం
2019 ఏప్రిల్ 12న హైదరాబాద్లో అంబేద్కర్ విగ్రహాన్ని వీహెచ్ ఆవిష్కరించారు. పంజాగుట్టలో ఆవిష్కరణ జరిగిన తర్వాత రోజే ఆ విగ్రహాన్ని ఎవరో కూల్చివేశారు. దీంతో వీహెచ్ మరో విగ్రహం చేయించారు. ఆ విగ్రహాన్ని ఎత్తుకుపోయి జైల్లో వేశారని, తనపై కేసు నమోదు చేశారని వీహెచ్ వాపోయారు. రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతిలకు కూడా లేఖలు రాశారు. కానీ ఇప్పుడు సచివాలయానికి పేరు పెట్టడంతో తన విగ్రహాం గురించి ప్రస్తావించారు.

పేరు కూడా
సెప్టెంబర్ 17ను జాతీయ సమైక్యత దినోత్సవంగా జరపనుండగా.. కొత్త సచివాలయానికి అంబేద్కర్ పేరు పెట్టాలని నిర్ణయం తీసుకుంది. ఇటీవలే ఢిల్లీలో కొత్తగా నిర్మించిన పార్లమెంట్ భవనానికి అంబేద్కర్ పేరు పెట్టాలని తెలంగాణ అసెంబ్లీలో తీర్మానం చేశారు. పార్లమెంట్ గురించి తర్వాత మాట్లాడుదాం.. ముందు కొత్తగా కట్టిన సచివాలయానికి అంబేద్కర్ పేరు పెట్టాలని బండి సంజయ్ సవాల్ చేశారు.

సవాల్తో కదలిక
దీంతో తెలంగాణ ప్రభుత్వం స్పందించింది. అంబేద్కర్ పేరు పెట్టాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి సీఎం కెసిఆర్ ఆదేశాలు జారీచేశారు. ప్రజలందరికీ అన్ని రంగాల్లో సమాన గౌరవం దక్కాలనే అంబేద్కర్ స్పూర్తి లక్ష్యంగానే తెలంగాణ ప్రభుత్వం ముందుకు సాగుతుందని కేసీఆర్ కామెంట్ చేశారు. అంబేద్కర్ రూపొందించిన ఆర్టికల్ 3 ద్వారానే తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటయ్యిందని గుర్తుచేశారు.
-
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!!












Click it and Unblock the Notifications