మొత్తం 3,584.. 490 ఔట్.. ఇంకా మిగిలేది ఎంతమందో?
హైదరాబాద్ : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా రాష్ట్రమంతటా భారీ స్థాయిలో నామినేషన్లు దాఖలయ్యాయి. మొత్తం 3,584 నామినేషన్లు వచ్చినట్లు ఎన్నికల అధికారులు ప్రకటించారు. అందులో 490 నామినేషన్లను రిజెక్ట్ చేశారు అధికారులు. తప్పులు రాయడం, సరిగా నింపకపోవడం, అఫిడవిట్లు పొందుపర్చకపోవడం తదితర కారణాలున్నట్లు సమాచారం.

అదలావుంటే నామినేషన్ల ఉపసంహరణకు గురువారంతో గడువు ముగియనుంది. మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్లు వాపసు తీసుకునే అవకాశముంది. అయితే చాలాచోట్ల నామినేషన్లు విత్ డ్రా చేసుకునే ఛాన్సున్నట్లు సమాచారం. మొత్తానికి ఎంతమంది పోటీ నుంచి తప్పుకుంటారో అనేది చర్చానీయాంశంగా మారింది. గురువారం సాయంత్రానికి ఎవరెవరు బరిలో నిలిచారనేది స్పష్టంగా తెలుస్తుంది. నామినేషన్ల ఉపసంహరణ తర్వాత తుది జాబితా ప్రకటించనున్నారు ఎన్నికల అధికారులు.












Click it and Unblock the Notifications