చిల్కూర్ బాలాజీ ఆలయంలో నేడే చివరి దర్శనం: రేపటి నుంచి గుడి తలుపులు మూసివేత..!
హైదరాబాద్: రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రఖ్యాతి చెందిన విసాల వెంకన్నస్వామి గుడి తలుపులు మూత పడబోతున్నాయి. చిల్కూర్ బాలాజీ దర్శనానికి ఇక కొన్ని గంటలే మిగిలి ఉంది. బుధవారం రాత్రి స్వామివారికి పవళంపు సేవ పూర్తయిన తరువాత.. ఆలయాన్ని మూసివేయనున్నారు అర్చకులు. ఎట్టి పరిస్థితుల్లోనూ వెంకటేశ్వరుడి దర్శనానికి భక్తులను అనుమతించరు. ప్రాణాంతక కోవిడ్-19 కరోనా వైరస్ను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు చిల్కూర్ బాలాజీ ఆలయ ప్రధాన అర్చకుడు రంగరాజన్ తెలిపారు.

సోషల్ ఐసొలేషన్ ప్రొటోకాల్లో భాగంగా..
స్వామివారికి రోజువారీ పూజాదికాలు, ఇతర సేవలను యధాతథంగా కొనసాగిస్తామని ఆయన చెప్పారు. భక్తులకు మాత్రం అనుమతి ఉండబోదని చెప్పారు. స్వామివారి సేవలన్నీ అర్చకుల సమక్షంలోనే నిర్వహిస్తామని, బయటి వారికి అనుమతించట్లేదని రంగరాజన్ స్పష్టం చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చిన పిలుపు మేరకు సోషల్ ఐసొలేషన్ ప్రొటోకాల్లో భాగంగా తాము ఈ నిర్ణయాన్ని తీసుకున్నామని చెప్పారు. భక్తులు తమకు సహకరించాలని విజ్ఙప్తి చేశారు.

ఉగాదిన పునఃదర్శనం..
ఈ నెల 25వ తేదీన నూతన తెలుగు సంవత్సరాది ఉగాదిని పురస్కరించుకుని ఆలయనాన్ని తెరుస్తామని, భక్తులకు దర్శన భాగ్యాన్ని కల్పిస్తామని వెల్లడించారు. ఆ తరువాత కూడా ఆలయాన్ని తెరిచే ఉంచాలా? లేదా? అనే విషయాన్ని అప్పటి పరిస్థితులను బట్టి నిర్ణయిస్తామని పేర్కొన్నారు. కరోనా వైరస్ ఒకరి నుంచి మరొకరికి సోకకుండా ఉండేలా తీసుకుంటున్న ముందుజాగ్రత్త చర్యల్లో భాగంగా ఆలయాన్ని మూసివేస్తున్నట్లు తెలిపారు.
Recommended Video

రద్దీని నివారించడానికే..
చిల్కూర్ బాలాజీని దర్శించుకోవడానికి రోజూ వందలాది మంది భక్తులు వస్తుంటారు. తెల్లవారు జాము నుంచీ స్వామివారి దర్శనానికి భక్తులు బారులు తీరుతుంటారు. ప్రదక్షిణలు చేస్తుంటారు. ఒకేచోట వందలాది మంది భక్తులు చేరుకోవడాన్ని నివారించడానికి చిల్కూర్ బాలాజీ అర్చకులు గుడి తలుపులను మూసివేయనున్నారు. కరోనా వైరస్ బారి నుంచి ప్రపంచాన్ని కాపాడాలంటూ ఇప్పటిదాకా పలు దఫాలుగా ఈ ఆలయంలో ప్రత్యేక పూజలను చేశారు. అరుదైన అపమర్జనా మంత్రాలను పఠించారు.
-
హైదరాబాద్ లో పెట్రోల్ బంకుల వద్ద అదేం రష్ రా అయ్యా- సిటీలో పెట్రోల్ కొరత? -
హైదరాబాద్ To బ్యాంకాక్.. తక్కువ ధరకే ఫారిన్ టూర్.. బీచ్ లో చిల్ అవుతూ.. -
క్యూర్, ప్యూర్, రేర్ అనే అనే మూడు ప్రాంతాలుగా తెలంగాణ: మూసీపై రేవంత్ కీలక ప్రకటన -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!!












Click it and Unblock the Notifications