ధరణి వారి కోసమే.. పట్టాదారులుగా భూస్వాములు: రేవంత్ రెడ్డి
తెలంగాణ సీఎం కేసీఆర్పై టీ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పైరయ్యారు. ధరణి పోర్టల్ ప్రారంభం వెనక కుట్ర ఉందని ఆరోపించారు. భూ దోపిడీ కోసమే పోర్టల్ ప్రారంభించారని ఘాటు వ్యాఖ్యలు చేశారు. పిడికెడు పెట్టుబడిదారుల కోసమే ధరణి పోర్టల్ తెరిచారని మండిపడ్డారు. దీంతో పాత భూస్వాములంతా తిరిగి పట్టాదారులుగా మారారని మండిపడ్డారు. కొందరి పేర్లను కూడా రేవంత్ రెడ్డి బహిరంగ పరిచారు. వారి కోసమే ధరణి ఏర్పాటు చేశారని తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.

మంత్రి మల్లారెడ్డి.. తదితరులు
'ధరణి'ని వాడుకొని మంత్రి మల్లారెడ్డి, మరి కొందరు టీఆర్ఎస్ నేతలు వందలాది ఎకరాలు ఆక్రమించుకున్నారని రేవంత్ రెడ్డి ఆరోపించారు. మేడ్చల్ జిల్లా కీసర మండలం రాంపల్లి దాయరలోని బాలవికాస్ ఇంటర్నేషనల్ కేంద్రంలో మూడు రోజుల పాటు 'భూ చట్టాలు, పంచాయతీ రాజ్ చట్టాలు' అంశంపై కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు నిర్వహించారు. ఈ క్రమంలోనే ధరణి పోర్టల్ గురించి రేవంత్ మాట్లాడారు. దీనితో ఉపయోగం కన్నా.. అనర్థమే ఎక్కువగా ఉందని చెప్పారు.

భూ చట్టాలు..
శిక్షణ తరగతుల ముగింపు సమావేశానికి రేవంత్రెడ్డి హాజరై మాట్లాడారు. పార్లమెంట్ మాజీ సభ్యురాలు మీనాక్షి నటరాజన్ ఆధ్వర్యంలో 'సర్వోదయ సంఘటన్ పాదయాత్ర' కొనసాగుతుందని రేవంత్ రెడ్డి తెలిపారు. భూదా న్ పోచంపల్లి నుంచి మహారాష్ట్ర వరకు 600 కిలోమీటర్ల పాదయాత్ర ఈ నెల 14న ప్రారంభం అవుతుందన్నారు. మేడ్చల్, మల్కాజిగిరిలో వారం పాటు పాదయాత్ర కొనసాగుతుందన్నారు. భూ చట్టాలపై రూపొందించిన ప్రత్యేక పుస్తకాన్ని రేవంత్రెడ్డి ఆవిష్కరించారు.

అంతా ఆన్ లైనే..
వాస్తవానికి ధరణి పోర్టల్తో మేలు జరుగుతుంది.. భూములన్నీ ఆన్ లైన్ జరుగుతుందని అంటున్నారు. అయితే కొందరు మాత్రం అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. తమ భూముల ఇతర పేరుతో ఆన్ లైన్ జరుగుతున్నాయనే కంప్లైంట్స్ వచ్చాయి. ఫిజికల్గా పట్టాదారు లేకపోవడం ఓ కారణమైపోయింది. ఈ అంశాన్నే రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. తన అనుయాయుల కోసమే కేసీఆర్ ధరణి పోర్టల్ ప్రారంభించారని రేవంత్ రెడ్డి ఫైరయ్యారు. దీనితో సామాన్యులకు ఓరిగేదేమీ లేదన్నారు.












Click it and Unblock the Notifications