డ్రగ్స్ దందాలో ముదుర్లు.. సాఫ్ట్ వేర్ ఉద్యోగులకు డ్రగ్స్ చేరవేసే బంటీ గ్యాంగ్ .. అమీర్ పేటలో అరెస్ట్
హైదరాబాద్ లో డ్రగ్స్ రాకెట్ గుట్టు రట్టయింది. గోవా నుంచి హైదరాబాద్ డ్రగ్స్ సరఫరా చేస్తున్న డ్రగ్స్ దందాలో ముదుర్లు అయిన బంటి గ్యాంగ్ ను ఎక్సైజ్ పోలీసులు పట్టుకున్నారు . అమీర్ పేటలో డ్రగ్స్ దందా చేస్తూ ఈ ముఠా పోలీసులకు పట్టుబడింది. వీరి వద్ద పెద్ద ఎత్తున డ్రగ్స్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సాఫ్ట్ వేర్ ఉద్యోగులను టార్గెట్ చేసుకొని వారికి బంటీ గ్యాంగ్ ఈ డ్రగ్స్ చేరవేస్తున్నట్లుగా ఎక్సైజ్ పోలీస్ అధికారులు గుర్తించారు.

డ్రగ్స్ రాకెట్ ను పట్టుకున్న ఎక్సైజ్ పోలీసులు .. భారీగా డ్రగ్స్ స్వాధీనం
అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ (ఎన్ఫోర్స్మెంట్) ఎన్ అంజిరెడ్డి ఈ ముఠాకు సంబంధించిన వివరాలు వెల్లడించారు . ఆయన మాట్లాడుతూ 46 ఎక్స్టాసీ మాత్రలు, రెండు గ్రాముల ఎండిఎంఎ, 10 గ్రాముల చరాస్, నాలుగు మొబైల్ ఫోన్లతో పాటు మాదక ద్రవ్యాల రవాణాకు ఉపయోగించిన కారు, మోటారుబైక్లను స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు . విశ్వసనీయ సమాచారంతో ఎక్సైజ్ అధికారులు అమీర్పేటకు చెందిన బికె గుడా వద్ద ఉన్న ఇంటిపై దాడి చేసి డ్రగ్స్ను స్వాధీనం చేసుకున్నారు.

డ్రగ్స్ దందాలో ఆరితేరిన ముదుర్లు .. సాఫ్ట్ వేర్ ఇంజనీర్లే టార్గెట్
డ్రగ్స్ మరియు ఆల్కహాల్ కు బానిస అయిన పిల్లి మనోజ్ కుమార్ అలియాస్ బంటి (31) అనే ప్రైవేట్ ఉద్యోగి కొకైన్, ఎండిఎంఎ, ఎక్స్టసీ మరియు ఇతర మాదకద్రవ్యాలను నగరంలోని వినియోగదారులకు విక్రయిస్తున్నట్లు అంజిరెడ్డి తెలిపారు. సైదాబాద్లోని బక్వర్బాగ్కు చెందిన జుహైర్ హుస్సేన్ నుంచి కొకైన్ను కొనుగోలు చేసినట్లు గతంలోనే అతనిపై ఆరోపణలు ఉన్నాయని అన్నారు . గతంలో కొకైన్ను ఆఫ్రికన్ డీలర్ల నుంచి కొనుగోలు చేసి అధిక ధరలకు వినియోగదారులకు విక్రయించారని అంజిరెడ్డి తెలిపారు.

సాఫ్ట్ వేర్ ఇంజనీర్ తో సహా ముగ్గురు గ్యాంగ్ సభ్యులను అరెస్ట్ చేసిన ఎక్సైజ్ పోలీసులు
సాఫ్ట్ వేర్ ఇంజనీర్ తో సహా ముగ్గురు గ్యాంగ్ సభ్యులను అరెస్ట్ చేసిన ఎక్సైజ్ పోలీసులు నిందితులు వాడిన టు వీలర్ లను, కార్లను సీజ్ చేశారు. పట్టుబడిన వారిని ప్రస్తుతం పోలీసులు విచారణ జరుపుతున్నారు. సాఫ్ట్వేర్ ఇంజనీర్ రోహిత్ కోసం ఎక్స్టాసీ మాత్రలు తీసుకురావటానికి గోవా వెళ్లినట్లు బంటీ తెలిపారు. అతను అమీర్పేటకు చెందిన జి. నవీన్ రాజ్, ఒక ప్రైవేట్ ఉద్యోగి, మోహిత్ శర్మ అలియాస్ మోంటి మరియు మరో ఇద్దరు వ్యక్తులతో కలిసి వెళ్లినట్టు పేర్కొన్నారు . ఈ బృందం సోమవారం నగరానికి తిరిగి వచ్చింది.ఈ క్రమంలో వారిని పట్టుకున్న ఎక్సైజ్ పోలీసులు వారి వద్ద నుండి డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు.

నగరంలో డ్రగ్స్ దందాపై కూపీ లాగుతున్న ఎక్సైజ్ పోలీసులు
బంటీ, నవీన్ మరియు రోహిత్ లను అరెస్టు చేసిన ఎక్సైజ్ పోలీసులు గోవాకు చెందిన కునాల్ షిండే మరియు రఫీ ఇద్దరూ మాదకద్రవ్యాలను బంటీ మరియు నవీన్లకు విక్రయించినట్లు తదుపరి విచారణలో తేలింది. షిండే మరియు రఫీ ఇద్దరూ పరారీలో ఉన్నారు.ఇంకా వీరి దందా నగరంలో ఎక్కడ వరకు విస్తరించింది అన్నదానిపై కూపీ లాగుతున్నారు. వారి వద్ద నుండి డ్రగ్స్ సరఫరా ఎక్కడెక్కడికి జరుగుతుంది.. పెడలర్స్ గా ఎవరెవరు పని చేస్తున్నారు? డ్రగ్స్ వాడకం దారులు ఎవరు ? అన్న కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు.
-
హైదరాబాద్ లో పెట్రోల్ బంకుల వద్ద అదేం రష్ రా అయ్యా- సిటీలో పెట్రోల్ కొరత? -
హైదరాబాద్ To బ్యాంకాక్.. తక్కువ ధరకే ఫారిన్ టూర్.. బీచ్ లో చిల్ అవుతూ.. -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
క్యూర్, ప్యూర్, రేర్ అనే అనే మూడు ప్రాంతాలుగా తెలంగాణ: మూసీపై రేవంత్ కీలక ప్రకటన -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..!












Click it and Unblock the Notifications