ప్రభుత్వ ఉద్యోగాల పేరుతో గాలం.. లక్షల్లో వసూలు.. కటకటాల్లో నిందితులు
హైదరాబాద్ : నిరుద్యోగుల ఆశల్ని సొమ్ము చేసుకుంటున్నారు కొందరు మోసగాళ్లు. ఉద్యోగాల వేటలో ఉన్న యువతను ముగ్గులోకి దించుతూ లక్షల్లో దోచుకుంటున్నారు. తాజాగా ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ నిరుద్యోగులను నిలువునా ముంచిన ముఠా గుట్టురట్టైంది. నాచారంలో నివాసముండే స్టాన్లీ డేవిడ్ (63సం.), దుర్గం చెరువు సరోజిని (56సం.), మరపాటి సుమన్ (33సం.) కలిసి ముఠాగా ఏర్పడ్డారు. నిరుద్యోగులకు గాలం వేస్తూ.. ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ లక్షల రూపాయలు దండుకున్నారు. 2014 నుంచి 2018 వరకు నాలుగేళ్లపాటు వీరి అక్రమ భాగోతం యదేచ్ఛగా సాగింది. ఒక్కొక్కరి నుంచి 3 లక్షల రూపాయల నుంచి 8 లక్షల 50 వేల రూపాయల వరకు డబ్బులు వసూలు చేశారు.

చేసిన పాపం ఊరికే పోదు కదా. పాపం పండే టైమొచ్చింది. చివరకు ఓ బాధితుడి ఫిర్యాదు మేరకు జైలు ఊచలు లెక్కిస్తున్నారు. మహబూబ్ నగర్ కు చెందిన శివకుమార్ అనే యువకుడు ఈ ముఠా చేసిన మోసంపై నాచారం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేసిన పోలీసులు నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు. వారి నుంచి 7 లక్షల రూపాయల నగదు, హోండా సిటీ కారు, 16 మందికి చెందిన విద్యార్హతల సర్టిఫికెట్లను, ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు.
-
ఎల్బీ నగర్ - హయత్ నగర్ డబుల్ డెక్కర్ ఎలివేటెడ్ కారిడార్! -
హైదరాబాద్ లో పెట్రోల్ బంకుల వద్ద అదేం రష్ రా అయ్యా- సిటీలో పెట్రోల్ కొరత? -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!!











Click it and Unblock the Notifications