GHMC Election Results 2020 Live:గ్రేటర్లో హంగ్..మేయర్ పీఠంపై కొనసాగుతోన్న ఉత్కంఠ
డిసెంబర్ 1వ తేదీన జీహెచ్ఎంసీ ఎన్నికలకు పోలింగ్ ముగిసింది. మొత్తం 150 డివిజన్లకు పోలింగ్ జరుగగా 149 డివిజన్లకు పోలింగ్ డిసెంబర్ 1వ తేదీన పోలింగ్ జరుగగా ఓల్డ్ మలక్పేట్కు మాత్రం డిసెంబర్ 3వ తేదీన రీపోలింగ్ జరిగింది. ఈ సారి పోలింగ్ శాతం తక్కువగా నమోదైంది. దీంతో పార్టీల్లో టెన్షన్ నెలకొంది. బీజేపీ సైలెంట్ వేవ్ను నమ్ముకోగా అధికారిక టీఆర్ఎస్ మాత్రం విజయం తమదే అన్న ధీమాతో ఉంది.
ఇక ఓల్డ్ మలక్పేట్లో రీపోలింగ్ ముగియగానే ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు హోరెత్తించాయి. అన్ని సర్వేలు గులాబీ పార్టీకే అనుకూలంగా తమ ఫలితాలను వెలువరించాయి. ఇక టీఆర్ఎస్ బీజేపీ మధ్య హోరాహోరీ పోరు జరిగిందని చెప్పుకొచ్చాయి. ఇదిలా ఉంటే మజ్లిస్ పార్టీ రెండో స్థానంలో నిలుస్తుందని చెప్పాయి. మేయర్ పీఠంను టీఆర్ఎస్ పార్టీ సొంతం చేసుకుంటుందని చెప్పాయి. అయితే ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు ఎలా ఉన్నప్పటికీ...ఓటర్ తీర్పు మాత్రం బ్యాలెట్ బాక్సులో నిక్షిప్తమై ఉంది. ఇక కౌంటింగ్ కేంద్రాల వద్ద గట్టి బందోబస్తును ఏర్పాటు చేశారు పోలీసులు.
ఇక గ్రేటర్ హైదరబాద్ ఎన్నికల కౌంటింగ్పై మినిట్-టూ- మినిట్ లైవ్ అప్డేట్స్ మీకోసం
#GHMCResults :బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో సంబరాలు, స్వీట్లు పంచుకున్న ముఖ్య నేతలు@BJP4Telangana @bandisanjay_bjp pic.twitter.com/kaELgkfQYk
— oneindiatelugu (@oneindiatelugu) December 4, 2020