ఈసారి ప్రగతి భవన్లోనే పంద్రాగస్ట్ వేడుకలు, వైరస్ వ్యాప్తి నేపథ్యంలో నిర్ణయం
కరోనా వైరస్ వల్ల స్వాతంత్ర దినోత్సవ వేడుకలను ప్రగతి భవన్లో నిర్వహించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. రాష్ర్టం ఆవిర్భవించినప్పటీ నుంచి గోల్కొండలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను నిర్వహిస్తున్నారు. అయితే కరోనా వైరస్ వ్యాప్తి వల్ల వేడుకల వేదికను మార్చివేశారు. ప్రగతి భవన్లో సీఎం కేసీఆర్ ఆగస్ట్ 15న ఉదయం 10.30కి జాతీయ జెండాను ఆవిష్కరిస్తారు. మంత్రులు జిల్లాల్లో జరిగే వేడుకల్లో పాల్గొంటారు.

ఆగస్టు 15వ తేదీన ఏయే జిల్లాల్లో ఎవరు జెండాను ఆవిష్కరించాలనే విషయంపై రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ బుధవారం ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే.. స్థానిక ఎమ్మెల్యేలు, మేయర్లు, జడ్పీ చైర్పర్సన్లు, డీసీసీబీ, డీసీఎంఎస్ చైర్ పర్సన్లు, మునిసిపల్ చైర్పర్సన్లు, ఇతర జిల్లాస్థాయి అధికారులు జిల్లా స్థాయిలో జరిగే ఉత్సవాల్లో పాల్గొంటారు. ఉదయం 10:30 గంటలకు తమ కార్యాలయాల్లో జాతీయ జెండాను ఆవిష్కరించాలని సూచించారు.
మండల స్థాయిలో ఎంపీపీలు, గ్రామస్థాయిలో సర్పంచ్లు జాతీయ జెండాను ఆవిష్కరిస్తారు. వేడుకల్లో పాల్గొనే ప్రతి ఒక్కరు తప్పనిసరిగా మాస్కులు ధరించాలని, భౌతిక దూరం పాటించడంతోపాటు శానిటైజర్లు ఉపయోగించాలని సీఎస్ స్పష్టంచేశారు.
-
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
2024 నాటి భీభత్సం మళ్లీ వస్తుంది: ఈ వేసవి చాలా కాలం ఉంటుంది! -
ఇన్నాళ్లూ ఆచితూచి- ఇప్పుడు ప్రధాని మోదీపై సీఎం డైరెక్ట్ అటాక్? -
ICC T20I ర్యాంకింగ్స్: దూసుకొచ్చిన సంజూ, ఇషాన్ - అభిషేక్ ఏ స్థానంలో..!! -
ఉగాది నుంచి మిథున రాశి, కర్కాటక రాశి వారి జాతక ఫలం -
తెలంగాణ నూతన డీజీపీ ఖరారు, అనూహ్య ఎంపిక..!! -
న్యూజిలాండ్ ఫస్ట్ సిరీస్- టీ20 వరల్డ్ కప్ ఫైనల్ తర్వాత జట్టులో భారీ మార్పలు -
దేశంలో తొలి `కారుణ్య మరణం`- తీర్పు చెబుతూ కన్నీళ్లు పెట్టిన సుప్రీంకోర్టు ధర్మాసనం -
"ఆయన్ను తట్టుకోలేక నరకం చూశా.. 16 సినిమాలు తిరస్కరించా" -
రిలయన్స్ ఇండస్ట్రీస్ బంపర్ ఆఫర్ ఇచ్చిన డొనాల్డ్ ట్రంప్ -
ఉప ప్రధానిగా చంద్రబాబు: వైఎస్ జగన్ రియాక్షన్












Click it and Unblock the Notifications