2024లో ప్రధాని కేసీఆరే, మంత్రి మల్లారెడ్డి హాట్ కామెంట్స్
తెలంగాణ మంత్రి మల్లారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్, బీజేపీ ఆటలు ఇక సాగవని తెలిపారు. హైదరాబాద్లో ఆ పార్టీలను తరిమికొడతామని వివరించారు. తమ పార్టీ ఆదరణ మరింత పెరుగుతుందని పేర్కొన్నారు. 2024 ఎన్నికల్లో జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పుతామని అన్నారు.
దేశంలో ఎక్కడ కూడా తెలంగాణలో ఉన్న గురుకుల పాఠశాలలు లేవని చెప్పారు. రాష్ట్రంలో వెయ్యి గురుకులాలు ఉన్నాయని తెలిపారు. ఈ ఘనత సీఎం కేసీఆర్కు దక్కుతుందని వివరించారు. మరే రాష్ట్రం ఇలా విద్య కోసం పథకాలు ప్రవేశపెట్టలేదని తెలిపారు. ఒక తెలంగాణలో అమలవుతున్నాయని పేర్కొన్నారు.

విద్యార్థులు తమకు ప్రయారిటీ అని మల్లారెడ్డి తెలిపారు. వారి భవిష్యత్ కోసం ఎన్ని కోట్లయినా ఖర్చు చేసేందుకు కేసీఆర్ వెనకాడటం లేదని తెలిపారు. రాష్ట్రంలో సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని పేర్కొన్నారు. మరే రాష్ట్రంలో కూడా ఇలా జరగడం లేదని తెలిపారు. వచ్చే ఎన్నికల్లో తమ పార్టీ అంతగా ప్రభావం చూపుతుందని పేర్కొన్నారు.
2024 ఎన్నికల్లో తమ పార్టీ దేశ వ్యాప్తంగా విజయఢంకా మోగించనుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఎర్రకోట మీద ప్రధాని హోదాలో కేసీఆర్ జెండా ఎగరేస్తారని ధీమా వ్యక్తం చేశారు. బీజేపీ ప్రతిపక్షానికే పరిమితం అవుతుందని వివరించారు. కాంగ్రెస్ ఎప్పటిలానే ఉంటుందని తెలిపారు. టీఆర్ఎస్ పార్టీ విజయం తథ్యం అని చెప్పారు.
-
Work From Home ఇచ్చేశారు. ప్రభుత్వం, ఐటీ దిగ్గజాల కీలక ప్రకటన! -
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
2024 నాటి భీభత్సం మళ్లీ వస్తుంది: ఈ వేసవి చాలా కాలం ఉంటుంది! -
ఇన్నాళ్లూ ఆచితూచి- ఇప్పుడు ప్రధాని మోదీపై సీఎం డైరెక్ట్ అటాక్? -
ICC T20I ర్యాంకింగ్స్: దూసుకొచ్చిన సంజూ, ఇషాన్ - అభిషేక్ ఏ స్థానంలో..!! -
ఉగాది నుంచి మిథున రాశి, కర్కాటక రాశి వారి జాతక ఫలం -
తెలంగాణ నూతన డీజీపీ ఖరారు, అనూహ్య ఎంపిక..!! -
న్యూజిలాండ్ ఫస్ట్ సిరీస్- టీ20 వరల్డ్ కప్ ఫైనల్ తర్వాత జట్టులో భారీ మార్పలు -
దేశంలో తొలి `కారుణ్య మరణం`- తీర్పు చెబుతూ కన్నీళ్లు పెట్టిన సుప్రీంకోర్టు ధర్మాసనం -
"ఆయన్ను తట్టుకోలేక నరకం చూశా.. 16 సినిమాలు తిరస్కరించా" -
రిలయన్స్ ఇండస్ట్రీస్ బంపర్ ఆఫర్ ఇచ్చిన డొనాల్డ్ ట్రంప్












Click it and Unblock the Notifications