గంగమ్మ ఒడికి చేరిన ఖైరతాబాద్ గణేశుడు..
11 రోజులపాటు భక్తుల నుంచి విశేష పూజలు అందుకొన్న ఖైరతాబాద్ వినాయకుడు గంగమ్మ ఒడికి చేరారు. మంగళవారం సాయంత్రం ట్యాంక్ బండ్పై నిమజ్జన ఘట్టం పూర్తయ్యింది. క్రేన్ నెంబర్ 4 వద్ద గణనాథుడు నిమజ్జనం చేశారు. కరోనా వైరస్ వల్ల కోవిడ్-19 నిబంధనలతో నిమజ్జన ప్రక్రియ కొనసాగింది. గణనాథులను చూసేందుకు భక్తుల సందడి కూడా పెద్దగా కనిపించలేదు.

వినాయకుడి శోభాయాత్ర టెలిఫోన్ భవన్, తెలుగుతల్లి ఫ్లైఓవర్, ఎన్టీఆర్ మార్గం గుండా సాగింది. శోభాయాత్రలో ధన్వంతరి అవతారంలో గణేశుడు దర్శనం ఇచ్చారు. శోభాయాత్రకు పోలీసులు భారీ బందోబస్తు నిర్వహించారు. ఎలాంటి అవాంచనీయ ఘటనలు జరగకుండా అన్ని ఏర్పాట్లు చేశారు. గణేశ్ నిమజ్జనం సందర్భంగా ట్యాంక్ బండ్ వైపు వాహనాలకు అనుమతించలేదు.
ప్రతి ఏటా భారీ గణనాథుడికి పూజలు నిర్వహించేవారు. కరోనా వైరస్ వల్ల ఈసారి 9 అడుగుల వినాయకుడిని ఏర్పాటు చేశారు. ప్రతి సంవత్సరం గణేశ్ నిమజ్జనం రోజున భాగ్యనగరం కిక్కిరిపోయేది. కానీ మాత్రం ఈ సారి నిమజ్జన వేడుకలు నిరాడంబరంగా జరిగాయి. రహదారిపై జనం పెద్దగా కనిపించలేదు.
-
హైదరాబాద్ లో మరో అద్దిరిపోయే రైల్వే స్టేషన్ -
భారత్ బిగ్ టర్న్: షాక్ ఇచ్చిన చైనా, రష్యా ఐరాస వేదికగా హైడ్రామా -
విద్యార్థులకు శుభవార్త.. ఒంటిపూట బడులపై విద్యాశాఖ ప్రకటన, ఎప్పటినుండి అంటే -
కుప్పకూలిపోయిన గ్యాస్ బుకింగ్ సిస్టమ్! ఇలా చేస్తేనే గ్యాస్ బుకింగ్ -
సాగర్ మీదుగా హైదరాబాద్ టు విజయవాడ ఎక్స్ ప్రెస్ వే -
విజయవాడ- నిడదవోలు రైల్వే రూట్ లో ఇకపై.. !! -
యుద్ధం ముగింపుకు ఇరాన్ 3 షరతులు-భారత్ పై ప్రభావం ఇదే ? -
లాక్ డౌన్ లోకి పాకిస్థాన్.. ఇప్పట్లో బయట పడడం కష్టమే..!! -
గ్రీన్ఫీల్డ్ జాతీయ రహదారి బెంగళూరు-కడప-విజయవాడపై ఏపీ సీఎం చంద్రబాబు కీలక ప్రకటన -
కుప్పకూలిపోతున్న బంగారం ధరలు.. !! -
అన్నదాత సుఖీభవ డబ్బుల జమ.. అన్నీ శుభవార్తలు చెప్పిన సీఎం చంద్రబాబు -
అరే.. ఏంట్రా ఇది: శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలన్నట్టు












Click it and Unblock the Notifications