తేలికపాటి జల్లులు: పెరిగిన చలి, ఉదయం, రాత్రి ఈదురు గాలులు
రాష్ట్రంలో శనివారం అక్కడక్కడ తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. శుక్రవారం పొడి వాతావరణం ఉంటుందని, ఈశాన్య దిశ నుంచి కింది స్థాయి గాలులు తెలంగాణ వైపు వీస్తున్నాయని వెల్లడించింది. దక్షిణ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం గురువారం ఆగ్నేయ బంగాళాఖాతం వరకు కొనసాగుతున్నట్లు తెలిపింది.

ఉపరితల ఆవర్తనం సముద్ర మట్టానికి 3.1 కి.మీ ఎత్తు వరకు వ్యాపించి ఉన్నదని, ఉపరితల ద్రోణి సముద్ర మట్టానికి 1.5 కి.మీ ఎత్తువరకు వ్యాపించి ఉందని పేర్కొంది. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో కనిష్ఠ ఉష్ణోగ్రతలు మరింతగా తగ్గిపోతుండడంతో చలి తీవ్రత పెరుగుతోంది. ఉదయం వేళల్లో దట్టమైన పొగమంచు ఆవరిస్తోంది. గురువారం ఆదిలాబాద్లో 15.7 డిగ్రీల అత్యల్ప కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. హన్మకొండ, హైదరాబాద్, మెదక్, నిజామాబాద్ జిల్లాల్లో 20 డిగ్రీల కంటే తక్కువగా కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
Recommended Video
ఇటు ఉదయం చలి తీవ్రత ఎక్కువగానే ఉంది. రాత్రి పూట కూడా మంచు కురుస్తోంది. తేమ వల్ల మధ్యాహ్నం తడి ఆరిపోతుంది. దాహం ఎక్కువగా తీసుకోవాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. ప్రస్తుతం కరోనా కేసులు లేకున్నా.. థర్డ్ వేవ్ భయం మాత్రం ఉంది. జనవరి నుంచి అంటున్నందున జాగ్రత్తగా ఉండటమే మంచిది.












Click it and Unblock the Notifications