25 వేల కుటుంబాలకు సరుకులు: బర్త్ డే వేళ మంచు మనోజ్ నిర్ణయం
కరోనా వేళ తల తలా సాయం చేయాలి. ప్రముఖులు ఆర్థికసాయం/ సరుకులు అందజేస్తున్నారు. టాలీవుడ్ హీరో మంచు మనోజ్ కూడా అలానే చేస్తున్నారు. మే 20న పుట్టినరోజు సందర్భంగా కీలక నిర్ణయం తీసుకున్నారు కరోనాతో బాధపడుతున్న కుటుంబాలకు సరుకులు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు ఓ ప్రకటన చేశారు.
అభిమానులు, మిత్రులతో కలిసి 25 వేల కొవిడ్ బాధిత కుటుంబాలకు నిత్యావసర వస్తువులు అందించనున్నట్టు మనోజ్ వెల్లడించారు. ఈ సేవలను ఇలాగే కొనసాగించాలని కోరుకుంటున్నానని మనోజ్ తెలిపారు. ప్రస్తుత కరోనా కష్టకాలంలో ప్రతి ఒక్కరూ ఇంట్లో ఉంటూ తమ కుటుంబాలను కాపాడుకోవాలని పిలుపునిచ్చారు. మాస్కులు ధరిస్తూ, తరచుగా శానిటైజ్ చేసుకుంటూ మన ప్రపంచాన్ని మనమే కాపాడుకుందామని పేర్కొన్నారు.
కరోనా వేళ మనోజ్ తీసుకున్న నిర్ణయం సరైంది. మిగతా వారికి ఆయన ఆదర్శంగా నిలిచారు. ఇందులో సందేహం లేదు. మిగతా స్టార్స్, ప్రముఖులు కూడా సాయం చేయాలని కోరుకుందాం.