కొన్ని కులాలే పాలిస్తున్నాయి, బలహీనవర్గాలకు అన్యాయం జరుగుతోంది: స్వామిగౌడ్ హాట్ కామెంట్స్
తెలంగాణ శాసనమండలి మాజీ చైర్మన్ స్వామి గౌడ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కుల రాజకీయాలపై బహిరంగంగా కామెంట్ చేశారు. రాష్ట్రం, కేంద్రంలో కొన్ని కులాలో పరిపాలన సాగిస్తున్నాయని మండిపడ్డారు. బడుగు బలహీనవర్గాలకు అధికారం దూరంగా ఉంటుందని చెప్పారు. కొద్దీ మంది ఉన్న అగ్ర కులాలే పాలిస్తున్నారని పరోక్షంగా ధ్వజమెత్తారు. ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్లో శ్రీ నారాయణ గురు జయంతి వేడుకలు జరిగాయి. కార్యక్రమంలో పాల్గొన్న స్వామి గౌడ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
అధికారం అందరికీ కాదు.. కొందరికే పరిమితమైందని స్వామిగౌడ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. బలహీనవర్గాలకు రాజ్యాధికారానికి దూరంగా ఉంటూనే వస్తున్నారని చెప్పారు. ఎన్నాళ్లీ వివక్ష.. కులజాఢ్యం వికృత రూపాన్ని ప్రదర్శిస్తోన్న బలహీనవర్గాలు ఎందుకు మిన్నకుండిపోతున్నారని ఆయన ప్రశ్నించారు. తమ అస్థిత్వం కోసం బడుగులు పోరాడాల్సిందేనని స్పష్టంచేశారు. ఇక పోరుబాట పట్టాల్సిందేనని పిలుపునిచ్చారు.

నారాయణ గురు ఆశయాలను బలహీనవర్గాలకు చెందిన ప్రజలు ముందుకు తీసుకెళ్లాలని కోరారు. అలా ముందుకెళ్లినప్పుడే వారికి మనం ఇచ్చే నివాళి అని గుర్తుచేశారు. బడుగు, బలహీనవర్గాలు సంఘటితం కావాల్సిన అవసరం ఉందన్నారు. మండలి చైర్మన్ పదవీ కాలం ముగిసాక ప్రత్యక్ష రాజకీయాలకు స్వామి గౌడ్ దూరంగా ఉంటూ వస్తున్నారు. పార్టీ కార్యక్రమాల్లో కూడా పాల్గొనడం లేదు. ఇన్నాళ్లకు అగ్ర కులాలపై కామెంట్స్ చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది.
-
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
విజయ్ ప్రభంజనం. 32 శాతం ఓట్లతో దూసుకుపోతున్న దళపతి! -
సీరియల్లో అలా.. సోషల్ మీడియాలో ఇలా.. బ్యూటీ పిక్స్ వైరల్ !! -
స్టేడియం ఖాళీ.. కుర్చీలు ఫుల్! పీఎస్ఎల్ అంటే ఇదేనా నాయనా? -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
India Post GDS 2nd merit list 2026: పోస్టల్ జాబ్స్ సెకండ్ మెరిట్ లిస్ట్ పై అప్డేట్..! -
ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్: రిటైర్మెంట్ వయస్సు పెంపు -
ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు పడే ఛాన్స్ -
ఈ అరటి కాయల మధ్య ఉన్న పామును కనిపెట్టగలరా..? -
రైతుభరోసా నిధుల విడుదల.. సీఎం రేవంత్ రెడ్డి ఆసక్తికర ట్వీట్! -
ఆరేళ్ల క్రితం ఇదే రోజు.. గుర్తుందా ఆ 'జనతా కర్ఫ్యూ'?












Click it and Unblock the Notifications