మంత్రి ఈటల పేషిలో కరోనా కలకలం: ఏడుగురికి పాజిటివ్, శుక్రవారం ఇంట్లోనే ఆమాత్యులు..
కరోనా వైరస్ ఎవరినీ వదలడం లేదు. తెలంగాణలోనూ వైరస్ కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. అయితే వైద్యారోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ పేషిలో ఏడుగురికి కరోనా వైరస్ పాజిటివ్ రావడం కలకలం రేపుతోంది. రాష్ట్రంలో మిగతా చోట్ల కూడా వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతోంది. రోజుకు కనీసం 2 వేల వరకు పాజిటివ్ కేసులు వస్తున్నాయి.

ఏడుగురికి కరోనా..
వైద్యారోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ పేషీలో ఏడుగురికి కరోనా పాజిటివ్ నిర్ధారణ జరిగింది. వీరిలో ఇద్దరు డ్రైవర్లు, ఇద్దరు పీఏలు, ముగ్గురు గన్మన్లు ఉన్నారు. ఈ క్రమంలో మంత్రి ఈటల రాజేందర్ సహా బీఆర్కే భవన్లోని పేషీ మిగతా సిబ్బంది మొత్తం పరీక్షలు చేయించుకున్నారు. అయితే అందరికీ నెగెటివ్ వచ్చింది. కరోనా వైరస్ కేసులు రావడంతో ఈటల రాజేందర్ శుక్రవారం బీఆర్కే భవన్కు రాలేదు. ఇంట్లోనే ఉండి ఉదయం, సాయంత్రం సందర్శకులను కలిశారని కార్యాలయ వర్గాలు తెలిపాయి.

తగ్గుతోన్న వెంటిలేటర్ల సంఖ్య
ఇదిలాఉంటే మరోవైపు కరోనా వైరస్ కోసం చికిత్స ఇస్తున్న ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఐసీయూ, వెంటిలేటర్ల బెడ్ల సంఖ్య గణనీయంగా తగ్గింది. ఈ నెల 14వ తేదీ వరకు 1,222 అందుబాటులో ఉండగా... నాలుగు రోజుల నుంచి తగ్గిస్తూ వస్తున్నారు. బుధవారం వరకు 1,177 బెడ్లు మాత్రమే అందుబాటులో ఉన్నాయని హెల్త్ బులెటిన్ ద్వారా నిర్ధారణ అవుతుంది. ఈ లెక్కన చూస్తే 45 బెడ్లు తగ్గాయి. అదే సమయంలో 14వ తేదీ నాటికి కార్పొరేట్ ఆస్పత్రుల్లో వెంటిలేటర్, ఐసీయూ పడకలు 2,129 ఉండగా.. ప్రస్తుతం అవీ 121 పెరిగి 2,250కి చేరుకున్నాయి.

ఎస్సై మృతి..
కరోనా వైరస్ మరో ఖాకీని కబలించింది. హైదరాబాద్ మాదాపూర్ ఎస్సై అబ్బాస్ అలీ శుక్రవారం చనిపోయారు. వైరస్ కోసం చికిత్స తీసుకొని మృతిచెందారు. లాక్డౌన్ సమయంలో వలస కార్మికులను స్వస్థలాలకు పంపించడంలో అబ్బాస్ కీలకంగా వ్యవహరించారు. ఇటు జగిత్యాలలో కాన్పు కోసం ప్రైవేటు ఆస్పత్రికి వెళ్లిన గర్భిణికి తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంది. కరోనా లక్షణాలు ఉన్నాయని డెలివరీ చేసుందుకు వైద్యులు నిరాకరించారు. బతిమిలాడితే శస్త్రచికిత్స చేశారు. బాబుకు జన్మనిచ్చిన అనంతరం మహిళను వేరే ఆస్పత్రికి తరలించాలని సూచించారు. దీంతో శిశువు సహా బాలింతను స్టేచర్పై బయటకు తీసుకు రాగా.. మరో ఆస్పత్రి వారు చేర్చుకోవడానికి నిరాకరించారు.
-
నయనతార బ్రేకప్ వెనుక అసలు రహస్యం.. ప్రభుదేవా ఆ ఒక్క కండీషన్ వల్లే? -
INS Aridhaman: ప్రళయ కాల రుద్రుడు, నీటి అడుగున భారత్ విశ్వరూపం.. -
ఇందిరమ్మ లబ్దిదారులకు గుడ్ న్యూస్.. రెండో విడత ఇళ్లపై కీలక ప్రకటన -
today rashiphalalu: నేడు అద్భుత రాజయోగంతో పండుగ చేసుకునే రాశులు ఇవే -
భారత్ కు పాక్ వార్నింగ్: ఇళ్లల్లోకి చొరబడి చంపుతాం.. -
ఇకపై 4 గంటలేక ఆఫీసులు క్లోజ్.. షాప్స్, మాల్స్ కూడా ?? -
బంగారం ధరలకు గత వైభవం -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, అసలు సమస్య - ఇలా చేయండి..!! -
ఈ కొమ్మల మధ్య ఉన్న పచ్చని పామును చూశారా ? -
ఉద్యోగులకు కూటమి ప్రభుత్వం భారీ గుడ్న్యూస్ -
ఇండియాలో ఫస్ట్ టైమ్ సెల్ఫ్ క్లీనింగ్ ఏసీ.. 10 సెకన్లలోనే కూలింగ్ !! -
విశాఖ రైల్వే జోన్ పరిధిలో కీలక మార్పులు, ప్రధాన మార్గం విలీనం..!!












Click it and Unblock the Notifications