Omicron టెన్షన్: ఫారిన్ నుంచి వచ్చిన ఇద్దరికీ పాజిటివ్, శాంపిల్ జీనోమ్ సీక్వెన్సింగ్
ఒమిక్రాన్ అంటేనే గుండె గుబేల్ అంటోంది. ఇప్పటి వరకు అయితే తెలుగు రాష్ట్రాల్లో కేసులు లేవు. కానీ అనుమానాలు మాత్రం ఉన్నాయి. తెలంగాణలో కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ టెన్షన్ పెడుతోంది. విదేశాల నుంచి తెలంగాణకు వచ్చిన మరో ఇద్దరికి కరోనా పాజిటివ్గా తేలింది. విదేశాల నుంచి తెలంగాణకు వచ్చిన 668 వారిలో ఇద్దరికి కరోనా పాజిటివ్ వచ్చింది. ఆ ఇద్దరి శాంపిల్స్ ను అధికారులు జీనోమ్ సీక్వెన్సింగ్ కు పంపారు. వాటి ఫలితాలు వస్తే గానీ ఒమిక్రాన్ వేరియంటా? కాదా అనే విషయం తేలనుంది.
ఇప్పటివరకు విదేశాల నుంచి తెలంగాణ రాష్ట్రానికి 3,235 మంది ప్రయాణికులు వచ్చారు. వీరిలో ఇప్పటివరకు 15 మంది ప్రయాణికులకు కరోనా పాజిటివ్ వచ్చింది. కరోనా పాజిటివ్ వచ్చిన వారిలో 13 మందికి ఒమిక్రాన్ నెగెటివ్ రిపోర్టు వచ్చింది. దేశంలో కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ కలకలం రేపుతోంది. దేశంలో ఒమిక్రాన్ కేసులు పెరుగుతున్నాయి. దేశంలో ఇవాళ 9 కేసులు రావడంతో ఆ సంఖ్య 32కు చేరింది. మహారాష్ట్రలో ఇవాళ ఏడు కొత్త ఒమిక్రాన్ కేసులు వచ్చాయి. ముంబైలో 3, పింప్రిలో 4 కొత్త వేరియంట్ కేసులు గుర్తించారు. మహారాష్ట్రలో ఒమిక్రాన్ కేసులు 17కు చేరాయి. రాజస్థాన్లో 9, గుజరాత్లో 3, కర్నాటకలో 2, ఢిల్లీలో ఒకటి చొప్పున ఒమిక్రాన్ కేసులు వచ్చాయి.
ఇటీవల విద్యా సంస్థల్లో కరోనా కేసులు ఎక్కువగా వస్తోన్న సంగతి తెలిసిందే. దీంతో పేరంట్స్ ఆందోళన చెందుతున్నారు. ఆ క్రమంలోనే స్కూల్స్/ కాలేజీలు మూసివేస్తారని రూమర్లు వచ్చాయి. వాస్తవానికి ఇప్పుడే మార్కెట్ కుదుటపడుతోంది. అన్నీ వ్యాపార లావాదేవీలు పుంజుకుంటున్నాయి. ఇంతలోనే ఇలా కొత్తగా ఒమిక్రాన్ వేరియంట్ కరోనా రావడం.. రాష్ట్రంలో కరోనా కేసులు పెరగడం కాస్త ఆందోళన కలిగిస్తోంది.
ఒమిక్రాన్ వైరస్ టెన్షన్ వెన్నులో వణుకు పుట్టిస్తోంది. కరోనా సెకండ్ వేవ్ గడ గడలాడించిన సంగతి తెలిసిందే. ఒమిక్రాన్ మూడో వేవ్ అనడంతో సర్వత్రా ఆందోళన నెలకొంది. అయితే వైరస్ నేపథ్యంలో ఒకటికీ రెండుసార్లు తనిఖీ చేయడం సహజమే.. కానీ కొందరు అవమాన పడాల్సి వస్తోంది. ఇటీవల లండన్ నుంచి వచ్చిన హైదరాబాదీ యువతి ఆ నిట్టూర్పు తప్పలేదు. ఇటు ఒమిక్రాన్ డెల్టా కంటే వేగంగా వ్యాపిస్తుంది. తీవ్ర ఒళ్ళు నొప్పులు, నీరసం, తలనొప్పి వంటి లక్షణాలు ఓమిక్రాన్ సోకిన వారికి ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. విదేశాల నుంచి వచ్చిన వారికి ఒమిక్రాన్ వైరస్ సోకుతుంది.