ఓయూలో కలకలం: హాస్టల్ గదిలో విగత జీవిగా పీహెచ్డీ విద్యార్థి
హైదరాబాద్: నగరంలోని ఉస్మానియా యూనివర్సిటీలో సోమవారం ఓ విద్యార్థి మృతి కలకలం రేపింది. పీహెచ్డీ చేస్తున్న ఓ యువకుడు యూనివర్సిటీ హాస్టల్ గదిలో అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు.
జాగ్రఫీ పీహెచ్డీ స్కాలర్ నరసయ్య(44) సోమవారం మధ్యాహ్నం యమునా హాస్టల్ రూం నెంబర్ 3లో విగతజీవిగా పడివుండటాన్ని గమనించిన తోటి విద్యార్థులు పోలీసులకు సమాచారం అందించారు. వెంటన్ హాస్టల్ వద్దకు చేరుకున్న పోలీసులు.. నరసయ్య మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.

అనంతరం ప్రిన్సిపాల్ ప్రతాప్ రెడ్డిని అడిగి ఘటనపై వివరాలు తెలుసుకున్నారు. నరసయ్య ఆత్మహత్య చేసుకున్నట్లుగా ప్రాథమికంగా నిర్ధారించి, అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ఆర్థిక సమస్యలు, నిరుద్యోగం కారణంగానే ఆత్మహత్యకు పాల్పడి ఉంటాడని అనుమానిస్తున్నారు.
కాగా, నరసయ్య మృతితో యూనివర్సిటీ విద్యార్థులు ఆందోళనకు దిగారు. అతడి కుటుంబానికి రూ. 50 లక్షల పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. రూ. 2లక్షల ఎక్స్ గ్రేషియా ఇస్తామని రిజిస్ట్రార్ ప్రకటించడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉద్రిక్తత పరిస్థితులు చోటు చేసుకునే అవకాశం ఉండటంతో పలువురు విద్యార్థులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
-
'రాత్రి 9 దాటితే నాకు ఆ కోరిక తప్పదు!' -
ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లో వండిన అన్నం తింటున్నారా- ఇది తెలుసుకోవాల్సిందే..!! -
పవన్ కళ్యాణ్ కొత్త మూవీలో "రౌడీ హీరో".. బాక్సాఫీస్ షేక్ పక్కా !! -
గ్యాస్ సిలిండర్ ధరలు మళ్లీ పెంపు, ఈ సారి ఎంత..!? -
వంట గ్యాస్ కొరత వేళ చంద్రబాబు కీలక ఆదేశాలు, రాష్ట్రంలో ఇక నుంచి..!! -
బీజేపీతో విజయ్ పొత్తు? తమిళ రాజకీయాల్లో ఊహించని ట్విస్ట్! -
"గోధుమ రవ్వ ఉప్మా" ఇలా చేస్తే ఇంటిల్లిపాది లొట్టలేయాల్సిందే..! -
నేడు, రేపు ఆకాశంలో ఓ అద్భుతం- డోన్ట్ మిస్ -
'బిడ్డను పెంచడానికి ఆ పనికైనా సిద్ధమే' -
ఎల్లుండే.. `ఉస్తాద్..` ఫ్యాన్స్ కు పండగ -
" ప్లీజ్.. ఆ విషయంలో భారత్ ను అడుక్కుంటున్న అమెరికా " -
ఉస్తాద్ భగత్ సింగ్ నిర్మాతలకు బిగ్ రిలీఫ్- ఏకంగా సుప్రీంకోర్టు స్టే












Click it and Unblock the Notifications