రేవంత్ రిక్వెస్ట్: రెండురోజులు 4 లోపు రావొద్దు.. ప్లీజ్, ఫేస్బుక్లో పోస్ట్
రేవంత్ రెడ్డి బిజీ బిజీగా ఉన్నారు. అధ్యక్ష పదవీ ఇంకా అధికారికంగా చేపట్టకున్నా.. వరస భేటీలతో తీరిక లేకుండా ఉన్నారు. ఆయనను కలిసేందుకు వెల్ విషర్స్ వస్తున్నారు. అభినందనలు చెప్పేందుకు నేతలు, శ్రేణులు, అభిమానులు పోటెత్తుతున్నారు. వాస్తవానికి రేవంత్ రెడ్డికి టీ పీసీసీ అధ్యక్ష పదవీ ఇవ్వడంతో రాష్ట్రంలో కొంచెం పరిస్థితులు మారిపోయాయి. అందుకు తగ్గట్టు రేవంత్ రెడ్డిని నేతలు కలువడం.. కేసీఆర్, కేటీఆర్లను రేవంత్ ఏకీపారేయడం జరుగుతుంది. హుజురాబాద్ బై పోల్ రేవంత్ రెడ్డికి కీలకం కానుంది.

ఆ సమయంలో రావొద్దు
ఇక విషయానికి వస్తే.. తనను కలిసేందుకు దూరం నుంచి శ్రేణులు వస్తున్నందున రేవంత్ రెడ్డి వారికి ఒక వినతి చేశారు. బుధవారం, గురువారం ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ ఉంది అని తెలిపారు. ఈ మేరకు సోషల్ మీడియా ఫేస్బుక్లో పోస్ట్ చేశారు. ఆ రెండురోజులు ఉదయం నుంచి సాయంత్రం 4 గంటల వరకు కలవడం వీలుపడదని చెప్పారు. దయచేసి అర్థం చేసుకోవాలని.. ఈ రోజులు సహకరించాలని కోరారు. తనను కలిసేందుకు వచ్చేవారు మాత్రం సాయంత్రం 4 గంటలు దాటిన తర్వాతే రావాలని కోరారు.

4 తర్వాత ఓకే
రేవంత్ రెడ్డి పోస్ట్ చేయడం వల్ల సుదూరం నుంచి వచ్చేవారు ఆగే వీలుంది. ఒకవేళ సాయంత్రం అయినా ఫరావాలేదు అనుకుంటే వచ్చేవారు రావచ్చు. పీసీసీ చీఫ్ పదవీ వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి తన మార్క్ పొలిటిక్స్ చేస్తున్నారు. అందరినీ కలుపుకొని పోతున్నారు. ఆస్పత్రిలో ఉన్న వీహెచ్ను పరామర్శించారు. తర్వాత కొండా దంపతులతో భేటీ, భారీ ర్యాలీతో సీతక్క రాక.. జానారెడ్డి, షబ్బీర్ అలీతో భేటీ అవుతూ.. పార్టీని మరింత బలోపేతం చేస్తున్నారు రేవంత్ రెడ్డి.

పరామర్శ
ఇటు సీతక్క తల్లి అనారోగ్యంతో ఆస్పత్రిలో ఉన్న సంగతి తెలిసిందే. ఆమెను రేవంత్ రెడ్డి పరామర్శించారు. బాగోగులను అడిగి తెలుసుకున్నారు. ఆయన వెంట సీతక్క సహా ఇతర నేతలు ఉన్నారు. రేవంత్ రెడ్డి ఇలా వరసగా అందరీతో మమేకం అవుతున్నారు. కలుపుకొని పోయి.. పార్టీని మరింత బలోపేతం చేస్తున్నారు.
-
రేవంత్ రెడ్డిని కలిసిన మాజీ మంత్రి రోజా - ఢిల్లీ కేంద్రంగా..!! -
వాహనదారులకు అదిరిపోయే శుభవార్త.. మార్చి 23నుండి మీ సమయం, డబ్బు రెండూ ఆదా! -
ఏప్రిల్ నెలలో మేషరాశి, వృషభ రాశి జాతక ఫలం -
బంగారం ధరలకు పూర్వవైభవం- పరుగులు -
ఉత్తరాభాద్ర నక్షత్రంలో శని సంచారం: కుంభరాశితో పాటు వీరికి సకల సంపదలు! -
today rashiphalalu:శుక్రుడు, శని కుంభరాశిలో.. వీరికి జాక్ పాట్! -
తప్పులో కాలేసిన విజయ్: ఏకంగా తలైవాతో..: కాలం మాట్లాడదు, వేచి ఉండి బదులిస్తుంది -
రైతులకు భారీ గుడ్ న్యూస్, పరిమితి రూ 5 లక్షలకు పెంపు - విధి విధానాలు..!! -
ఫస్ట్ ఒక స్టోరీ చెప్పి షూటింగ్కి వెళ్లాక దుస్తులు తీసేయాలన్నారు..! -
రైతు భరోసాపై మరో శుభవార్త చెప్పిన తెలంగాణా ప్రభుత్వం.. త్వరపడండి! -
ఉచిత బస్సు పథకంలో ఇక కొత్తగా, నేటి నుంచి పాస్ ల జారీ- మార్గదర్శకాలు..!! -
తెలంగాణ స్టైల్ 'పచ్చి పులుసు'.. జస్ట్ 10 నిమిషాల్లోనే రెడీ..!












Click it and Unblock the Notifications