వీడేం పూజారిరా నాయనా.. ముక్తి కోసం గుడికొస్తే, నగలు తీసుకొని చంపేశాడు..
భుక్తి కోసం.. ముక్తి కోసం ప్రార్థన మందిరానికి వెళుతుంటాం.. అదీ ఆలయం, చర్చి, మసీదు కావచ్చు. అయితే ఒంటరికి వెళ్లొద్దు.. అదీ కూడా సాయంత్రం పూట వెళ్లద్దు.. ఎందుకు అంటే.. ఆలయాలు ఎలాగైనా శివారులో ఉంటాయి. అక్కడ మిగతా భక్తులు లేరనుకో.. పూజారీ ఏమైనా చేయొచ్చు.. అంటే ఒంటి నిండా బంగారు ఆభరణాలు ఉంటే చోరీ చేయొచ్చు.. లేదంటే హత్య కూడా చేయచ్చు.. మల్కాజిగిరిలో ఉమాదేవి అనే మహిళ ఇదేవిధంగా హత్యకు గురయ్యింది. దీనిని బట్టి మిగతా వారు కూడా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది.
ఉమాదేవి హత్య కేసును పోలీసులు ఛేదించారు. సిద్ధి వినాయక ఆలయానికి వెళ్లిన ఉమాదేవిని విగత జీవిగా మారింది. అయితే ఆమె సాయంత్రం వెళ్లడం.. ఒంటి నిండ పది తులాల బంగారు ఆభరణాలు ఉండటంతో పూజారి మురళీ కృష్ణకు దుర్బుద్ది పుట్టింది. మంచి, మానవత్వం కూడా ఆలోచించలేదు. మహిళను హత్య చేసి.. నగలు తీసుకున్నాడు. పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు.

ఈ నెల 18వ తేదీన సిద్ధి వినాయక ఆలయానికి వెళ్లిన ఉమాదేవి ఆ తర్వాత నుంచి కనించకుండా పోయారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. సీసీటీవీ ఫుటేజ్ పరిశీలించారు. గుడికి వెళ్లిన ఉమాదేవి గురించి విచారణ చేయగా ఎవరిపై సందేహాం కలుగలేదు. ఆలయ పరిసరాల్లో సీసీ కెమెరాలు కూడా లేవు. ఆలయం వెనుక భాగంలో నాలా, తుప్పు ఉంది.
ఉమాదేవి ఇంటికి తిరిగిరాలేదు. ఆమె కనిపించడం లేదని పోస్టర్లు కూడా అతికించారు. ఉమాదేవి మిస్సింగ్ అయ్యాక ఆమె కోసం గాలిస్తున్న పోలీసులు...ఇవాళ ఆలయం పరిసరాల్లో విస్తృతంగా వెతికారు. నాలాలు, తుప్ప ఉన్న ప్రదేశంలో మహిళ మృతదేహం కనిపించింది. దీంతో కుటుంబసభ్యులకు సమాచారం ఇచ్చారు. అక్కడ క్లూస్ ఆధారాలు సేకరించే పనిలో ఉన్నారు. పోస్ట్మార్టం పూర్తయ్యాక ...ఉమాదేవి మృతికి సంబంధించిన పూర్తి వివరాలు తెలుస్తాయని పోలీసులు అంటున్నారు. కానీ ప్రాథమికంగా మాత్రం.. పూజారి హత్య చేశాడని ధృవీకరించారు.
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా -
కొంపలు అంటుకున్నాయ్: 4 నెలల కనిష్టానికి బంగారం ధరలు












Click it and Unblock the Notifications