రైతు బంధు కొత్త జాబితాపై రెవెన్యూ శాఖ కసరత్తు.. లక్షన్నర మందికి అందని సాయం..?
బ్యాంకుల విలీనంతో రైతు బంధు నగదు జమ ఇబ్బందికరంగా మారింది. దీంతో కొత్త ఖాతా నంబర్, ఆధార్ కార్డ్, పట్టాదార్ పాస్ పుస్తకం అగ్రికల్చర్ అధికారి ఇవ్వాలని సోషల్ మీడియాలో పోస్టులు వస్తున్నాయి. దీనిని వ్యవసాయ ఖండించినట్టు వార్తలు కూడా వచ్చాయి. అయితే రైతు బంధు కొత్త జాబితా తయారీలో రెవెన్యూ సిబ్బంది నిమగ్నం అయ్యారని తెలిసింది.
2018 వానాకాలంసీజన్ నుంచి రైతుబంధును ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఏడాదికి రెండు పంటల చొప్పున ఒక్కోపంటకు తొలిసారి ఎకరానికి రూ.4 వేలు ఇచ్చారు. 2019 వానాకాలం నుంచి ఎకరాకు రూ.5 వేలకు పెంచగా ఇప్పుడు ఏడాదికి రెండు పంటలకు కలిపి ఎకరాకు పదివేల రూపాయలు రైతుల బ్యాంకు ఖాతాల్లో జమవుతున్నాయి. 2018 నుండి ఈ ఏడాది మార్చి వరకూ 6 పంట సీజన్లకు మొత్తం రూ.35,911 కోట్లను ప్రభుత్వం జమ చేయగా ఈ ఏడాది వానాకాలం, యాసంగి సీజన్లలో కలిపి మొత్తం రూ.14,800 కోట్లు ఇస్తామని కేసీఆర్ ప్రభుత్వం బడ్జెట్లో నిధులు కూడా కేటాయించింది.

గత యాసంగిలో 59,25,725 మంది రైతుల ఖాతాల్లో నగదు జమ చేయగా ఇప్పుడు రైతుల సంఖ్య 60 లక్షలకు చేరవచ్చని అంచనా వేస్తున్నారు. ఇప్పుడు వచ్చే వానాకాలం, యాసంగి పంటలకు గాను రైతుబంధుకు అవసరమైన జాబితాను వ్యవసాయశాఖ సిద్ధం చేస్తోంది. వ్యవసాయ సిద్ధం చేసే రైతుల తాజా జాబితాలను రెవెన్యూశాఖ పరిశీలించి అక్కడ నుండి అవి జూన్ 10వ తేదీ వరకు జాతీయ సమాచార కేంద్రానికికి అందజేస్తుంది. అక్కడ నుండి నిధులు విడుదల చేస్తే అవి రాష్ట్రవ్యాప్తంగా రైతుల ఖాతాలలో జమకానున్నాయి.
Recommended Video
రాష్ట్రంలో లక్షన్నర మంది రైతులు సరైన పత్రాలు అందించక రైతు బంధు అందడం లేదని ప్రభుత్వ వర్గాలు చెప్తున్నాయి. అయితే వారంతా సరి అయిన పత్రాలు అందించి సాయాన్ని పొందాలని కోరుతుంది. ఇన్నాళ్లు లేదు.. మరీ ఈ సారైనా వారికి వస్తాయో లేదో చూడాలీ మరీ.
-
అల్లు అర్జున్ "పుష్ప - 3"లో స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ భార్య.. -
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్ -
వంటగ్యాస్ కష్టాలకు చెక్, ప్రభుత్వం కీలక నిర్ణయం- సరఫరా ఇక నుంచి..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
శత్రువులు ఎక్కడో లేరు నా వెనుకే ఉన్నారు - మెగా డాటర్ నిహారిక -
జన్మ నక్షత్రం అశ్వని, భరణి, కృత్తిక ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
'అమరావతి' కోసం అసెంబ్లీ ప్రత్యేక భేటీ, జగన్ అనూహ్య నిర్ణయం..!! -
RCB పేరు మారుతుందా?.. అనన్య బిర్లా క్లారిటీ! -
విశాఖపట్నం-బెంగళూరు ప్రయాణికులకు గుడ్ న్యూస్- ఈ వీక్లీ రైళ్లు ఇక..! -
అన్ని రాష్ట్రాల సీఎంలతో ప్రధాని మోదీ సమావేశం.. సంచలన నిర్ణయం దిశగా..!! -
బంగారం మళ్ళీ పెరిగింది: తులం ఈ రోజు ఎంత? కారణాలేంటి?












Click it and Unblock the Notifications