Swathi Naidu:భర్త వల్ల ఎలాంటి యూజ్ లేదు: మోసపోయానని కన్నీళ్లు
శృంగార తార స్వాతి నాయుడు.. ఏం చేసినా సంచలనమే.. తన ఫ్యామిలీ.. భర్త, పాప గురించి పలు పోస్టులు చేస్తుంటారు. మరోసారి భర్త గురించి చెబుతూ బాధపడింది. అతని వల్ల ఏం ప్రయోజనం లేదని తెలియజేసింది. తాను ప్రేమించి పెళ్లి చేసుకున్న భర్త గురించి స్వాతి నాయుడు వివరించారు. అతని వల్ల ఏం యూజ్ లేదని.. తమ మధ్య భార్య భర్తల బంధం లేదని నిట్టూర్చింది.
గోడ, సోఫా మాదిరిగానే..
ఎలా అంటే ఇంట్లో గోడ, సోఫా, వస్తువుల మాదిరిగా భర్త కూడా ఉన్నాడని తెలిపింది. ఫీలింగ్స్ లేకుండా సంసారం కొనసాగుతోందని వాపోయింది. ఏడ్చిన, నవ్విన అడిగే దిక్కులేదని.. తన పాప బాగోగులు కూడా పట్టించుకోకుంటే ఇక ఎందుకు అని స్వాతి నాయుడు తన బాధను తెలియజేసింది. స్వాతి నాయుడు పోస్టులకు యూజర్లు స్పందించారు. జీవితంలో క్లిష్ట పరిస్థితులు తప్పవని.. వాటిని ధైర్యంగా ఎదుర్కొవాలని సూచించారు. లైఫ్ను సమర్థవంతంగా లీడ్ చేయాలని కోరారు. చిన్న దానికే ఇలా డీలా పడిపొవద్దని సూచించారు.
లైఫ్లో ఏ మార్పులేదు
పెళ్లయిన తర్వాత జీవితం బాగుంటుందని అనుకున్నారు. కానీ లైఫ్ ఏ మార్పు లేదని చెప్పింది. అంతకుముందు ఎలా ఉందో ఇప్పుడు కూడా మారలేదని పేర్కొన్నారు. అంతకుముందు తన తండ్రి ఆర్థికంగా మోసం చేశాడని స్వాతి నాయుడు వాపోయిన సంగతి తెలిసిందే. రెక్కలు ముక్కలు చేసుకొని.. సంపాదిస్తే తన తండ్రి ఛీట్ చేశాడని తెలిపింది. నటించిన చిత్రాలకు సంబంధించి నగదు ఇచ్చేవారని.. దానిని పెళ్లి తర్వాత అడిగానని తెలిపారు. నగదు ఇవ్వలేదు అని.. ఇంట్లో నుంచి గెంటేశారని వివిరించారు.
మారని స్వాతినాయుడు తలరాత
పెళ్లి అయిన తర్వాత కూడా తన తలరాత మారలేదని వివరించారు. భర్త తాగి వచ్చి గొడవ చేయడం.. చిందులేయడంతో సరిపోయిందని చెప్పారు. అందుకే భర్త నుంచి కూడా దూరంగా ఉంటున్నట్టు తెలిసింది. పెళ్లయిన తర్వాత విజయవాడలో ఉండగా.. ఇప్పుడు హైదరాబాద్ శివారల్లో ఒంటరిగా ఉంటున్నట్టు సమాచారం. కూతురితో కలిసి ఉంటున్నారని తెలుస్తోంది.
Recommended Video
చివరికీ భర్త కూడా
స్వాతి నాయుడు శృంగార తారగా తెలుసు.. పలు చిన్న సినిమాల్లో నటించారు. అలాగే యూట్యూబ్లలో వీడియోలు కూడా చేశారు. దీంతో ఆమెకు మంచి క్రేజ్ ఏర్పడింది. తన భావాలను ఆమె పంచుకునేవారు. అలా ఆమెకు ఎక్కడలేని హైప్ వచ్చింది. ఇప్పుడు తనకు భర్త లేడని.. మోసపోయానని తన బాధను నెటిజన్లతో పంచుకున్నారు.