తెలంగాణలో రెండురోజులు వర్షాలు, హైదరాబాద్లో భారీ వర్షం..
ఉపరితల ఆవర్తణ ద్రోణితో తెలంగాణలో వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. రెండురోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉంది. తమిళనాడు నుంచి ఛత్తీస్గఢ్ వరకు 900 మీటర్ల ఎత్తులో ఉపరితల ఆవర్తన ద్రోణి ఏర్పడింది. ప్రస్తుతం మహారాష్ట్ర పరిధిలోని మరాఠ్వాడాలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. దీని ప్రభావంతో ఆది, సోమవారాలు అక్కడక్కడ వర్షాలు కురిసే అవకాశం ఉంది అని హైదరాబాద్ వాతావరణ కేంద్ర అధికారులు తెలిపారు. దక్షిణ భారతదేశం నుంచి తెలంగాణ దిశగా తేమగాలులు వీస్తున్నాయన్నారు

శనివారం నుంచి చల్లని వాతావరణం నెలకొంది. ఈదురుగాలులు కూడా వీశాయి. ఆదివారం ఉదయం నుంచి కూడా వాతావరణం చల్లగా ఉంది. హైదరాబాద్లో భారీ వర్షం కురుస్తోందని అధికారులు హెచ్చరించారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఉపరితల ఆవర్తనంతో చలిగా ఉంది. శనివారం హైదరాబాద్లో 29.2 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. ఇటు రాష్ట్రంలో ఇతర చోట్ల కూడా వర్షం కురిసింది. కరీంనగర్ జిల్లా వెల్దిలో 60, సర్వాయిపేటలో 44.3, హుస్నాబాద్లో 30.8 మిల్లీ మీటర్ల వర్షం కురిసింది.
-
గ్రేట్ సార్.. ట్యాంక్ బండ్ శివకు అండగా సీఎం రేవంత్ ! -
ఆ యూనివర్సిటీలో ఎలుకల భయం.. 11మంది విద్యార్థులను కరిచిన ఎలుకలు! -
పెళ్లికి రెడీ అయిన యంగ్ కపుల్.. -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
తిరుపతిలో ఎయిర్ పోర్టును తలదన్నేలా..!! -
ఏపీ ప్రజలకు డిసెంబర్ లోగా మరో బహుమానం.. ఫిక్స్ చేసిన సీఎం చంద్రబాబు












Click it and Unblock the Notifications