సీఎం కనీసం స్పందించారా....? వెటర్నరీ వైద్యురాలి హత్యపై లక్ష్మణ్
వెటర్నరీ వైద్యురాలు హత్య దేశవ్యాప్తంగా సంచలనం రేపుతున్నా... తెలంగాణ సీఎం కేసీఆర్ కనీసం స్పందించరా...? అంటూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ ప్రశ్నించారు. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వానికి రోజులు దగ్గరపడ్డాయని ఆయన హెచ్చరించారు. భువనగిరిలో పార్టీ కార్యాలయం నూతన భవన నిర్మాణానికి భూమిపూజ చేశారు.
ఈ నేపథ్యంలోనే ప్రియాంక రెడ్డి హత్యపై ఆయన మాట్లాడుతూ...హైదరాబాద్తో పాటు వరంగల్ జిల్లాలో జరిగిన హత్యాచార ఘటనలపై దేశం మొత్తం స్పందిస్తూ... తీవ్రంగా ఖండిస్తున్నారని అయినా... రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఇప్పటి వరకు నోరు విప్పక పోవడంపై ఆయన ఆశ్చర్యం వ్యక్తం చేశారు. దీంతో సీఎం కేసీఆర్ పరిపాలనతో ప్రజలు విసిగిపోతున్నారని అన్నారు. ఇది టీఆర్ఎస్ పాలనకు సమాధి కడతారని ఆయన జోస్యం చెప్పారు.

మరోవైపు ఫ్రెండ్లీ పోలిసింగ్ పేరుతో శాంతిభద్రతలను పరిరక్షించడంలో తెలంగాణ పోలీసులు వైఫల్యం చెందారని ఆయన ఆరోపణలు చేశారు. ఈనేపథ్యంలోనే హజీపూర్ సంఘటన అనంతరం నేటి వరకు 60మందికి పైగా మహిళలు ,యువతులు తప్పిపోయినా...పోలీసులు పట్టించుకోకుండా ఉన్నారని విమర్శించారు.
-
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
ఎట్టకేలకు జీవన్ రెడ్డి చేరే పార్టీ ఖరారు, అదే బాటలో..!!












Click it and Unblock the Notifications