వివాహిత అదృశ్యం.. ఏడాది క్రితం పెళ్లి, ఐటీ కొలువు.. కానీ
హైదరాబాద్లో ఓ యువతి కనిపించకుండా పోయింది. దోమలగూడలో ఉంటున్న భార్గవి అనే యువతి నిన్నటి నుంచి కనిపించకుండా పోయింది. బ్యూటీ పార్లర్ కు వెళ్తున్నానని చెప్పి బయటకు వెళ్లిన భార్గవి తిరిగి రాలేదు. దీంతో నిన్నటి నుంచి కుటుంబీకులు భార్గవి కోసం తెలిసిన వాళ్ల దగ్గర, బంధువుల ఇళ్లలో వెతికారు. అయినా ఫలితం లేకపోయింది. దీంతో వారు ఆందోళన చెందుతున్నారు.

భార్గవి ఓ ప్రైవేట్ కంపెనీలో సాఫ్ట్ వేర్ ఇంజినీర్ గా పని చేస్తోంది. ఆమెకు ఏడాది క్రితమే వివాహమైంది. భార్గవి ఆచూకీ తెలియకపోవడంతో ఆందోళనకు గురైన కుటుంబసభ్యులు చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ ఫిర్యాదు చేశారు. మిస్సింగ్ కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. నగరంలోని పలు ప్రాంతాల్లో భార్గవి నడుచుకుంటూ తిరుగుతున్నట్లు సీసీ కెమెరాల ఫుటేజీలో పోలీసులు గుర్తించారు. భార్గవి ఆచూకీ కోసం పోలీసులు విసృతంగా గాలిస్తున్నారు.
Recommended Video
భార్గవి.. భార్య భర్తల మధ్య ఏమైనా గొడవలు ఉన్నాయా అనే అంశంపై క్లారిటీ లేదు. మంచి కొలువు చేస్తూ.. ఎక్కడికి వెళ్లిందనే అనుమానం వస్తోంది. భర్త వేధించేవాడా..? లేక ఇతర సమస్య ఉందా అనే సందేహాలు వస్తున్నాయి. కానీ భార్గవి కనిపించే వరకు ఇవన్నీ సశేష ప్రశ్నలుగానే మిగులుతాయి.
-
పీఎం కిసాన్ - అన్నదాత సుఖీభవ నిధుల జమ: ఖాతాల్లో రూ 6 వేలు, తాజా నిర్ణయం..!! -
T20 WC 2026 ఫైనల్ గెలిచేది ఆ జట్టే: మహమ్మద్ అమీర్ -
140 కోట్ల మంది కలలు ఛిద్రం.. ప్రపంచ కప్ నుంచి భారత్ అవుట్! -
రైతు భరోసా నిధులు జమ విషయంలో లేటెస్ట్ అప్డేట్! -
మిథునరాశిలో బృహస్పతి ప్రత్యక్ష సంచారం.. ఈ రాశులవారు నక్కతోక తొక్కుతున్నారు! -
బెంగళూరుకు ప్రత్యేక రైళ్లు- ఏపీలో హాల్ట్ స్టేషన్లు -
ఉగాది నుంచి మకర రాశి, ధనుస్సు రాశి వారి జాతక ఫలం -
టాలీవుడ్ స్టార్ హీరో ఎంగేజ్మెంట్ -
రైతులకు శుభవార్త.. ఆ డబ్బులు నేరుగా మీ బ్యాంకు ఖాతాల్లోనే! -
today rashiphalalu:కుంభరాశిలో ముఖ్య గ్రహాలతో వీరింట సంపదల పంట! -
నరేంద్ర మోదీ స్టేడియంలో లక్కీ లెగ్ ల్యాండ్- లెక్క సరిపోయింది -
బంగాళాఖాతంపై ఉపరితల ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు












Click it and Unblock the Notifications