హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

పేదల వైద్యానికి 8వందల కోట్లు లేవా దొరా? ఆరోగ్యశ్రీ జోలికొస్తే ఖబడ్దార్: వైఎస్ షర్మిల!!

|
Google Oneindia TeluguNews

వైయస్ఆర్ తెలంగాణ పార్టీ అధినేత్రి వైయస్ షర్మిల తెలంగాణ సీఎం కేసీఆర్ పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. సీఎం కేసీఆర్ తెలంగాణ ప్రజలను మోసం చేస్తున్నారని, చాలా విషయాలలో ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా అన్యాయం చేస్తున్నారని పదేపదే మండిపడుతున్న వైయస్ షర్మిల ఆరోగ్యశ్రీని మూసివేయాలని ప్రయత్నం చేస్తున్నారంటూ సీఎం కేసీఆర్ ను టార్గెట్ చేశారు.

ఆ ఎమ్మెల్యేల ఎరకేసులో రేవంత్ రెడ్డికి కొత్త ఆయుధం..!ఆ ఎమ్మెల్యేల ఎరకేసులో రేవంత్ రెడ్డికి కొత్త ఆయుధం..!

 కేసీఆర్ అధికారంలోకి వచ్చాక ఆరోగ్యశ్రీ నిర్వీర్యం

కేసీఆర్ అధికారంలోకి వచ్చాక ఆరోగ్యశ్రీ నిర్వీర్యం

వైయస్ రాజశేఖర్ రెడ్డి ఆరోగ్యశ్రీ పథకాన్ని తీసుకువచ్చారని పేర్కొన్న షర్మిల, ఆరోగ్యశ్రీ పథకాన్ని సీఎం కేసీఆర్ నిర్వీర్యం చేస్తున్నారన్నారు. ఆరోగ్యశ్రీ మహానేత వైఎస్ఆర్ సృష్టించిన గొప్ప పథకం అని పేర్కొన్న వైయస్ షర్మిల పేదలకు ఏ రోగమొచ్చినా కార్పొరేట్ స్థాయిలో ఉచిత వైద్యం అందించాలని ఈ పథకాన్ని ప్రవేశపెట్టారని గుర్తు చేశారు. దీని ద్వారా లక్షల మంది ఉచితంగా వైద్యం, ఆపరేషన్లు చేయించుకున్నారని వైయస్ షర్మిల పేర్కొన్నారు. కానీ కెసిఆర్ అధికారంలోకి వచ్చాక ఆరోగ్యశ్రీని నిర్వీర్యం చేశాడని వైయస్ షర్మిల మండిపడ్డారు.

 నీకు జ్వరం వేస్తే యశోద.. కంటికి నొప్పి వస్తే ఢిల్లీకి.. కానీ పేదల పరిస్థితి ఏంటి?

నీకు జ్వరం వేస్తే యశోద.. కంటికి నొప్పి వస్తే ఢిల్లీకి.. కానీ పేదల పరిస్థితి ఏంటి?


ఈ పథకానికి నిధులు ఇవ్వకుండా, పేదలకు కార్పొరేట్ వైద్యం అందించకుండా కెసిఆర్ కుట్ర చేస్తున్నాడు అని పేర్కొన్న వైయస్ షర్మిల తెలంగాణ రాష్ట్రంలో ప్రజలకు అందించే ఉచిత వైద్య సేవలను కేసీఆర్ నిర్వీర్యం చేస్తున్నాడంటూ అసహనం వ్యక్తం చేశారు. ఇప్పటికే గ్రామస్థాయిలో పేదలకు ఉచిత వైద్యం, మందులు అందించే 104 అంబులెన్స్ లను మూసేశారు. ఇప్పుడు ఆరోగ్యశ్రీకి ఎసరు పెడుతున్నాడు. నీకు జ్వరం వేస్తే యశోద.. కంటికి నొప్పి వస్తే ఢిల్లీకి.. పోతావ్! అంటూ ప్రశ్నించిన వైయస్ షర్మిల పేదలకు కార్పొరేట్ ఆసుపత్రులకు పోవద్దా అంటూ నిలదీశారు.

నీ పార్టీ అకౌంట్ లో వేల కోట్లున్నా.. పేదల వైద్యానికి డబ్బు లేదా దొరా?

నీ పార్టీ అకౌంట్ లో వేల కోట్లున్నా.. పేదల వైద్యానికి డబ్బు లేదా దొరా?


నీ పార్టీ అకౌంట్లో వేల కోట్లు ఉంటయ్.. కమీషన్ల కాళేశ్వరానికి లక్షల కోట్లు ఉంటయ్.. బి ఆర్ ఎస్ ఆఫీసు కట్టుకోవడానికి వేల కోట్ల పైసలు ఉంటాయ్.. కానీ పేదల వైద్యానికి ఎనిమిది వందల కోట్లు లేవా దొరా అంటూ వైయస్ షర్మిల సీఎం కేసీఆర్ కు సూటి ప్రశ్న వేశారు. ఆరోగ్యశ్రీని మూసివేయాలని ప్రయత్నిస్తే ఊరుకునేది లేదు ఖబడ్దార్ అంటూ హెచ్చరికలు జారీ చేశారు. తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ ప్రభుత్వ పాలన వైఫల్యాలను అడుగడుగున ఎండగడుతున్న వైయస్ షర్మిల నిత్యం ఏదో ఒక విషయంలో ప్రజా సమస్యలపై , పాలకుల తీరును ప్రశ్నిస్తూనే ఉన్నారు.

English summary
YS Sharmila alleges that KCR is planning to down Arogya sri services in Telangana state and is trying to close down Arogyasri. She warned that if such an attempt is made, it will not be easy
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X