శనివారం నాటికి భారత్ జనాభా 127,42,39,769
న్యూఢిల్లీ: శనివారం (11, జూలై) సాయంత్రం 5 గంటలకు మన దేశ జనాభా సరిగ్గా 127,42,39,769కి చేరింది. ఏటా 1.6 శాతం చొప్పున నమోదవుతున్న వృద్ధి కారణంగా 2050 నాటికి చైనాను అధిగమించి ప్రపంచంలో అత్యధిక జనాభా ఉన్న దేశంగా భారత్ నిలిచే అవకాశముందని జాతీయ జనాభా స్థిరీకరణ నిధి తెలిపింది.
శనివారం ప్రపంచ జనాభా దినోత్సవం సందర్భంగా ఈ గణాంకాలను ప్రకటించింది. ఇప్పటికీ ప్రపంచ జనాభాలో 17.25 శాతం జనాభా భారత్లో ఉంది. ఐదో స్థానంలో ఉన్న బ్రెజిల్ కంటే మన దేశంలోని ఉత్తర ప్రదేశ్ జనాభా సంఖ్యే ఎక్కువ.

139 కోట్ల జన సంఖ్యతో ప్రపంచంలో మొదటి స్థానంలో ఉన్న చైనా కంటే మన దేశంలో జనాభా వృద్ధి రేటు.1.63 ఎక్కువగా ఉంది. ఈ లెక్కను మన దేశ జనాభా 2050కి 163 కోట్లకు చేరుకోవచ్చు. 2013 నాటికి సంతాన సాఫల్యత 2.3గా ఉంది. ఆ సంఖ్య స్థిరంగా లేదు. వివాహమైన వయసును బట్టి పిల్లల సంఖ్య ఆధారపడింది.
2011 జనాభా లెక్కల ప్రకారం మన దేశ జనాభా 121 కోట్లు. అమెరికా, ఇండోనేషియా, బ్రెజిల్, పాకిస్తాన్, బంగ్లాదేశ్, జపాన్ దేశాల్లో ఉన్న జనసంఖ్యకు ఇది దాదాపు సమానం. రాజస్థాన్, జార్ఖండ్, బీహార్ వంటి రాష్ట్రాల్లో 21-26 శాతం మంది వధువుల వయస్సు 18 ఏళ్ల కంటే తక్కువ.
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా -
కొంపలు అంటుకున్నాయ్: 4 నెలల కనిష్టానికి బంగారం ధరలు












Click it and Unblock the Notifications