ఘోరం: వర్షాల దెబ్బకు విరిగి పడిన కొండచరియలు.. 14 మంది దుర్మరణం?
అరుణాచల్ ప్రదేశ్ లో మంగళవారం ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. నాలుగు రోజులుగా కురుస్తున్న వర్షాలకు కొండచరియలు విరిగి పడి 14 మంది దుర్మరణం పాలయ్యారు.
ఇటానగర్: అరుణాచల్ ప్రదేశ్ లో మంగళవారం ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. నాలుగు రోజులుగా కురుస్తున్న వర్షాలకు కొండచరియలు విరిగి పడిన ఘటనలో 14 మంది జాడ తెలియకుండా పోయారు.
ఈ దుర్ఘటన పాపుంపరే జిల్లాలోని సగాలీ సబ్ డివిజన్ లో ఉన్న లాప్టాప్ గ్రామంలో జరిగింది. జోరుగా కురుస్తున్న వర్షాల దెబ్బకు ఈ గ్రామాన్ని ఆనుకుని ఉన్న కొండచరియలు విరిగి పడ్డాయి. ఈ దుర్ఘటనలో 14 మంది గల్లంతయ్యారు.

ప్రస్తుతం సహాయక చర్యలు జరుగుతున్నాయని, అయితే వీరు ప్రాణాలతో ఉంటారన్న ఆశలు లేవని అధికారులు సైతం తెలిపారు. ఈ దుర్ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.












Click it and Unblock the Notifications