గుజరాత్లో ఘోర రోడ్డు ప్రమాదం, 21 మంది మృతి, ప్రధాని మోడీ సంతాపం
గుజరాత్లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బనస్కాంత జిల్లా అంబాజీ వద్ద బస్సు లోయలో పడిపోయింది. ప్రమాద సమయంలో బస్సులో 50 మందికి పైగా ప్రయాణికులు ఉన్నారు. ప్రమాదంలో 21 మంది మృతిచెందారు. మృతుల్లో 14 మంది పురుషులు, ముగ్గురు మహిళలు, నలుగురు చిన్నారులు కూడా ఉన్నారు. 32 మంది గాయపడ్డారు. వారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. బస్సు డ్రైవర్ అదుపుతప్పడంతో ప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు.
గుజరాత్లో భారీ వర్షాలు కురుస్తోన్నాయి. బనస్కాంత జిల్లాలో ఆ ప్రభావం ఎక్కువగానే ఉన్నాయి. దీంతో డ్రైవర్ నియంత్రణ కోల్పోవడంతో ప్రమాదం జరిగింది. రోడ్డు ప్రమాద విషయం తెలుసుకొని ప్రధాని నరేంద్ర మోడీ దిగ్బాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సంతాపం తెలిపారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందజేయాలని అధికారులను ఆదేశించారు.

రోడ్డు ప్రమాదంపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా కూడా దిగ్బాంతి వ్యక్తం చేశారు. ప్రమాద ఘటనపై స్థానిక అధికారులను అప్రమత్తం చేశామని పేర్కొన్నారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. మరోవైపు ఆదివారం ఓ ఎస్యూవీ వాహనం ట్రక్కును ఢీ కొని ఐదుగురు ప్రయాణికులు మృతిచెందిన సంగతి తెలిసిందే. అహ్మదాబాద్ వడోదర ఎక్స్ ప్రెస్ వేపై రోడ్డు ప్రమాదం జరిగింది. నిన్న ఉదయం 7.30 గంటలకు ప్రమాదం జరిగిందని స్థానిక అధికారులు తెలిపారు.
SG Shah, Additional District Health Officer on bus accident in Banaskantha, Gujarat: Death toll has risen to 18 https://t.co/ZbhGD6vtoS
— ANI (@ANI) September 30, 2019
-
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
2024 నాటి భీభత్సం మళ్లీ వస్తుంది: ఈ వేసవి చాలా కాలం ఉంటుంది! -
ఇన్నాళ్లూ ఆచితూచి- ఇప్పుడు ప్రధాని మోదీపై సీఎం డైరెక్ట్ అటాక్? -
ICC T20I ర్యాంకింగ్స్: దూసుకొచ్చిన సంజూ, ఇషాన్ - అభిషేక్ ఏ స్థానంలో..!! -
ఉగాది నుంచి మిథున రాశి, కర్కాటక రాశి వారి జాతక ఫలం -
తెలంగాణ నూతన డీజీపీ ఖరారు, అనూహ్య ఎంపిక..!! -
న్యూజిలాండ్ ఫస్ట్ సిరీస్- టీ20 వరల్డ్ కప్ ఫైనల్ తర్వాత జట్టులో భారీ మార్పలు -
దేశంలో తొలి `కారుణ్య మరణం`- తీర్పు చెబుతూ కన్నీళ్లు పెట్టిన సుప్రీంకోర్టు ధర్మాసనం -
"ఆయన్ను తట్టుకోలేక నరకం చూశా.. 16 సినిమాలు తిరస్కరించా" -
రిలయన్స్ ఇండస్ట్రీస్ బంపర్ ఆఫర్ ఇచ్చిన డొనాల్డ్ ట్రంప్ -
ఉప ప్రధానిగా చంద్రబాబు: వైఎస్ జగన్ రియాక్షన్












Click it and Unblock the Notifications