21 ఏళ్ల యువతిపై అత్యాచారం, ట్రావెల్ డ్రైవర్పై కేసు
రాజ్కోట్: తనపై అత్యాచారం చేశాడంటూ ఓ 21 ఏళ్ల యువతిపై టూర్ ట్రావెల్ డ్రైవర్పై కేసు పెట్టింది. గుజరాత్ రాష్ట్రంలోని రాజ్కోట్లో ఈ సంఘటన చోటు చేసుకుంది. ఆ ఫిర్యాదుతో మహిళా పోలీసు స్టేషన్ అధికారులు ఆనందనగర్ ప్రాంతంలో నివసించే లాలా వలంద్ అనే వ్యక్తిపై అత్యాచారం కింద కేసు నమోదు చేశారు.
లాలా అనే 48 ఏళ్ల వ్యక్తి అతని తనపై అత్యాచారం చేశాడని, విషయాన్ని బయటకు చెప్తే చంపేస్తానని బెదిరించాడని ఆ యువతి చెప్పింది. జమ్మూ కాశ్మీర్లో విహార యాత్రకు కుటుంబ సభ్యులతో వెళ్లినప్పుడు యువతికి 2014 మేలో లాలాతో పరిచయం ఏర్పడింది.
ఆ యాత్ర నుంచి తిరిగి వచ్చిన తర్వాత తనకు గుర్తు తెలియని వ్యక్తి నుంచి ఫోన్ రావడం ప్రారంభమైందని, తనతో మాట్లాడకపోతే తల్లిదండ్రులనూ సోదరుడనీ అపహరిస్తానని బెదిరిస్తూ వచ్చాడని, ఫోన్ చేసిన వ్యక్తి తన పాత ఫ్రెండ్ అయి ఉండవచ్చునని భావించానని, దానిపై తాను ఎవరికీ చెప్పలేదని ఆమె వివరించింది.
వేర్వేరు నెంబర్లతో ఆ వ్యక్తి తనకు ఫోన్ చేస్తూ వచ్చాడని, కొన్నాళ్లకు టూర్కు సంబంధించిన డబ్బులు తీసుకోవడానికి లాలా వాలంద్ తమ ఇంటికి వచ్చాడని, తనకు అతను ఓ సిమ్ కార్డు ఇచ్చి, దాన్నివాడాలని చెప్పాడని ఆమె అన్నది. డిసెంబర్లో ఫోన్ చేసి తన ఇంటికి రావాలని, లేదంటే చంపేస్తానని బెదిరించాడని, తాను వెళ్లినప్పుడు తనపై అత్యాచారం చేశాడని ఆమె ఆరోపించింది.