సుత్తూరు జాత్రలో పేలిపోయిన నైట్రోజన్ బెలున్, మైసూరు స్వామీజీ బచావ్, నాయకులకు గాయాలు !
మైసూరు: కర్ణాటకలోని మైసూరు జిల్లా నంజనగూడులో జరుగుతున్న సుత్తూరు జాత్ర మహోత్సవాల్లో అపసృతి చోటుచేసుకుంది. సుత్తూరు జాత్ర సందర్బంలో నైట్రోజన్ బెలున్ పేలిపోవడంతో ముగ్గురికి తీవ్రగాయాలు కావడంతో వారిని ఆసుపత్రికి తరలించారు.
నైట్రోజన్ బెలున్ పేలిన సమయంలో అక్కడే ఉన్న సుత్తూరు మఠాధిపతి శ్రీ శివరాత్రి దేశీకేంద్ర స్వామీజీ అదృష్టవశాత్తు ఎలాంటి గాయాలు కాకుండా బయటపడ్డారు. సుత్తూరు జాత్ర సందర్బంగా మంగళవారం నంజగూడులో కుస్తీ పోటీలు ప్రారంభం అయ్యాయి.
కుస్తీ పోటీలు మొదలు అయ్యే సందర్బంగా నైట్రోజన్ బెలున్ ఏర్పాటు చేశారు. ఆ సందర్బంలో నైట్రోజ్ బెలున్ పేలిపోవడంతో బీజేపీ నాయకులు శివకుమార్, హోసకోటే రేవణ్ణ, మరి తిచ్చేగౌడలకు గాయాలైనాయి. వెంటనే తీవ్రగాయాలైన వారిని ఆసుపత్రికి తరలించారు.
సుత్తూరు జాత్రకు కర్ణాటక మాజీ ముఖ్యంత్రి బీఎస్. యడ్యూరప్ప హాజరు కావలసి ఉంది. అయితే బెంగళూరులో బీజేపీ ఎమ్మెల్యేల అత్యవసర సమావేశం నిర్వహిస్తున్నందున బీఎస్. యడ్యూరప్ప తన కార్యక్రమాన్ని వాయిదా వేసుకున్నారు. సుత్తూరు జాత్రలో అనేక మంది బీజేపీ నాయకులు, వేలాధి మంది ప్రజలు పాల్గొన్నారు.