Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

శ్రీరామ నవమి వేడుకలో అపశృతి: మెట్లబావిలో పడిన 30 మంది, 11 మంది మృతి

ఇండోర్: శ్రీరామ నవమి వేడుకల్లో అపశృతి చోటు చేసుకుంది. మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఇండోర్‌లోని ఓ ఆలయంలో మెట్లబావి పైకప్పు కూలడంతో అందులో 30 మంది వరకు భక్తులు పడిపోయారు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు, అధికారులు బావిలో పడివారిని బయటికి తీశారు. వీరిలో పలువురికి తీవ్ర గాయాలు కాగా, 11 మంది ప్రాణాలు కోల్పోయారు.

ఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళితే.. ఇండోర్ పటేల్‌నగర్ ప్రాంతంలోని మహదేవ్ జులేలాల్ ఆలయంలో రామనవమి ఉత్సవాలు జరుగుతున్నాయి. ఈ వేడుకలకు పెద్ద ఎత్తున భక్తులు హాజరయ్యాయి. స్థలాభావం కారణంగా కొందరు ఆలయ ప్రాంగణంలో ఉన్న మెట్లబావి పైకప్పుపై కూర్చున్నారు.

over 25 people fall Into Stepwell At Indore Temple, Rescue Operations On

అయితే, కొంతసేపటి తర్వాత ఆ బావి పైకప్పు ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. దీంతో దాదాపు 25 మందికిపైగా భక్తులు అందులో పడిపోయారు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.


నిచ్చెన సాయంతో భక్తులను బయటకు తీసుకొచ్చేందుకు యత్నిస్తున్నారు. ఇప్పటి వరకు 10 మందిని బయటికి తీసి ఆస్పత్రికి తరలించారు. తీవ్రగాయాలపాలైన 11 మంది భక్తులు.. చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయారు. బావి లోతు 50 అడుగులపైనే ఉన్నట్లు తెలుస్తోంది. బావిలో పడిన మిగితా భక్తులను కూడా బయటికి తీసేందుకు పోలీసులు, అధికారులు శ్రమిస్తున్నారు.

ఈ ఘటనపై మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు. సహాయక చర్యలు ముమ్మరం చేయాలన్నారు. బాధితులను బావిలోంచి బయటికి తీసి వెంటనే ఆస్పత్రికి తరలించి వైద్యం అందించాలన్నారు. క్షతగాత్రులంతా త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+