యూపీలో దారుణం.. బాణసంచా ఫ్యాక్టరీలో పేలుడు.. ఆరుగురు దుర్మరణం
అనధికార బాణసంచా తయారీ కారణంగా ఆరుగురు దుర్మరణం పాలయ్యారు. అనేక మంది గాయాలపాలయ్యారు. దీపావళి సమీపిస్తుండటంతో అనేక మంది అనధికారికంగా బాణసంచా తయారీ లో నిమగ్నం అయ్యారు. అధికారుల నిఘా లోపించటంతో వీరు యధేచ్చగా అక్రమంగా బాణసంచా తయారు చేస్తూ అనేక మంది ప్రాణాలు పోవటానికి కారణమవుతున్నారు. ఉత్తప్రదేశ్ లోని మిరేచీ టౌన్ లోని టకియా ప్రాంతంలో ఇటవంటి దుర్ఘటనే చోటు చేసుకుంది.
నిరేష్ జాతవ్ అనే వ్యక్తికి చెందిన నివాసంలో అక్రమంగా బాణసంచా తయారు చేస్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగినట్లుగా గుర్తించారు. అందులో ఆరుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఆ ఇల్లు పూర్తిగా డామేజ్ అయింది. కాగా..ఇంటి శిధిలాల కింద మరి కొంత మంది ఉన్నట్లుగా అధికారులు అనుమానిస్తున్నారు. విషయం తెలిసిన వెంటనే పోలసులు..స్థానిక అధికారులు సహాయ చర్యలకు రంగంలోకి దిగారు. క్షతగాత్రులను సమీపంలోని ఆస్పత్రికి తరలించారు.

జిల్లా మెజిస్ట్రేట్ షుకాల్ భారతీతో పాటుగా సీనియర్ పోలీసు అధికారులు ఘటనా స్థలిలోనే ఉండి సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు. ఘటన పైన ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. ఇటువంటి అనుమతులు లేకుండా బాణసంచా తయారు చేస్తున్న వారి పైన కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం ఆదేశించింది.
-
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు బంపరాఫర్.. భారీ డిస్కౌంట్ -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి? -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !!












Click it and Unblock the Notifications