మోడీ సంచలనం: కనపడని బ్లాక్ మనీ ఎంతంటే ?
న్యూఢిల్లీ: ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ తీసుకున్న రూ. 500, రూ. 1,000 నోట్ల రద్దు వ్యవహారం దేశ వ్యాప్తంగానే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా సంచలనం రేపింది. ఇంత కాలం ఆదాయ పన్ను ఎగరేసి పెద్ద ఎత్తున డబ్బు దాచిపెట్టుకున్న నల్లకుబేరులకు పెద్ద షాక్ తగిలింది.
అయితే బ్లాక్ మనీ ఎంత ఉందో తెలుసుకున్న అధికారులు షాక్ తిన్నారు. అకస్మాత్తుగా తీసుకున్న ఈ నిర్ణయం వలన ఇంత కాలం చెల్లుబాటు అయిన నగదులో 86 శాతం డబ్బుకు సంబంధించి క్రయ విక్రయాలు పూర్తిగా నిలిచిపోయాయి.
రిజర్వు బ్యాంక్ అధికారుల లెక్కల ప్రకారం నవంబర్ 8వ తేది పెద్ద నోట్ల రద్దు ప్రకటన వెలువడినప్పటి నుంచి ఇప్పటి వరకు రూ. 14 లక్షల కోట్ల సోమ్ము వినియోగంలో ఉంది. అందులో
రూ. 6.33 లక్షలు వెయ్యి రూపాయల నోట్లు ఉన్నాయి.

7.85 లక్షల రూపాయలు రూ. 500 నోట్లు ఉన్నాయి. అందులో ఉద్దేశ పూర్వకంగా మార్చుకోని సొమ్ము కొంత ఉంటే, మధ్యతరగతి, సామాన్య ప్రజల దగ్గర కొంత డబ్బు ఉంటుందని అధికారులు అంటున్నారు.
అయితే లావాదేవీలు నిలిచిపోయిన సొమ్ములో సగానికి పైగా బ్లాక్ మని నల్ల కుబేరుల దగ్గర ఉండిపోయిందని ఆర్థిక నిపుణులు అంచనా వేశారు. కేవలం రెండు మూడు రోజుల్లో ఇంత బ్లాక్ మనీ బయటపడితే ఇంకా ఎంత డబ్బు నల్ల కుబేరుల దగ్గర ఉందో ? అని ఆర్థిక, ఆదాయ పన్ను శాఖ అధికారులు ఆరా తీస్తున్నారు.












Click it and Unblock the Notifications