Tata Nexon: కొత్త కారు చూసి షాకైన కస్టమర్.. అన్నీ డ్యామేజీలే..!
కారు కొనాలని చాలా మందికి ఉంటుంది. కానీ ఆర్థిక పరిస్థితుల సహకరించక.. తక్కువ మందే కారు కోంటారు. కొంత మంది సెకండ్ హ్యాండ్ కారు కొనుగోలు చేస్తే మరి కొందరు కొత్త కారు కొనుగోలు చేస్తారు. తాజాగా బెంగళూరుకు చెందిన ఓ వ్యక్తి కారు కొనాలని షో రూం వెళ్లారు. అక్కడ కారు ఆర్డర్ ఇచ్చారు. కొద్ది రోజుల తర్వాత కారు డెలవరీ వచ్చింది. డబ్బులు పే చేశాడు. దీంతో కారు డెలివరీ చేశారు.
అతను కారును పరిశీలించి షాక్ అయ్యాడు. శరత్ కుమార్ అనే రూ. 18.2 లక్షలు పెట్టి టాటా నెక్సాన్ కారును కొన్నాడు. కారును పరిశీలించి షాక్ కు గురయ్యాడు. కారు పై గీతలు, డ్యామేజీలే కనిపించాయి. కారును పూర్తి పరిశీలంచాలని డోర్ ఓపెన్ చేశాడు.అన్నీ సొట్టలు.. గీతలు, హెడ్ లైట్లలో వాటర్.. ఫ్రంట్ బంపర్ల పై గీతలు, క్వార్టర్ ప్యానెల్ ఫ్రేమ్, టెయిల్ గేట్ ఫ్రేమ్ తో పాటు నాసిరకం వెల్డింగ్ , సరిగ్గా అమర్చని డోర్ బీడింగ్ లతో సహా కారు మొత్తం అన్నీ లోపాలతో కనిపించింది.

డెలివరీ ముందు చెకింగ్, నాణ్యత నియంత్రణ పరిశీలన లేకపోవడంతో వల్లే ఇలా జరిగిందని అంటున్నారు శరత్ కుమార్ తెలిపారు. దీంతో శరత్ కుమార్ కారును వెంనటే షో రూంకు తీసుకెళ్లాడు. ప్రేరణా మోటార్స్ డీలర్ షిప్ యాజమాన్యాన్ని ప్రశ్నించారు. అయితే రీప్లేస్ మెంట్, రీఫండ్ కు ప్రేరణా మోటార్స్ అంగీకరించలేదని శరత తెలిపారు. బదులుగా రీపేర్ చేసిన వాహనాన్ని రెండేళ్ల వారంటీ ఇస్తాం తీసుకెళ్లండి అని సూచించినట్లు పేర్కొన్నాడు.
దీనికి అంగీకరించని శరత్ కుమార్ ఇన్ స్టాగ్రామ్ లో తనకు జరిగిన అన్యాయాన్ని పోస్ట్ చేశారు. దీంతో ఈ పోస్ట్ వైరల్ అయింది. దీనిపై నెటిజన్లు స్పందిస్తూ.. ఇది అన్యాయం అంటూ కామెంట్ చేస్తున్నారు. మరి కొందరు ముందుగా చెక్ చేసుకోవాలి కదా అంటూ కామెంట్లు చేస్తున్నారు. దీపై టాటా మోటర్స్ ఏమైన స్పందిస్తుందో చూడాలి.
-
Viral Video: రైల్వే బోగీనా..? లేక బార్ అండ్ రెస్టారెంట్ అనుకున్నారా..? -
ఇంటికి పిలిచి మరీ రష్మిక ముద్దుల వర్షం! వీడియో -
బ్రావో ఇంట్లో ఆ ఇద్దరు అమ్మాయిలు ఎవరు? రహస్యాలు లీక్! వీడియో -
40 ఏళ్లలో లేని అతిపెద్ద పసిడి పతనం. 1983 సీన్ రిపీట్! -
పాతాళానికి బంగారం ధరలు- రంజాన్ పండగ వేళ -
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం: విజయ్ రాకతో మారిన ఈక్వేషన్లు -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు!












Click it and Unblock the Notifications