తల్లి రాసలీలలు చూసిన కొడుకు, మమ్మీకి బాయ్ ఫ్రెండ్ కాదు, గర్ల్ ఫ్రెండ్, రిచ్ ఫ్యామిలీలో హత్య!
పశ్చిమ బెంగాల్లోని హుగ్లీలో ఓ తల్లి ఆమె స్వలింగ సంపర్కురాలితో శృంగారంలో పాల్గొనడం ఆమె కొడుకు చూశాడు. మమ్మీ, ఆంటీ ఎందుకు ఇలా చేస్తున్నారు అంటూ ఆ అబ్బాయి ఆలోచించాడు. తన స్నేహితురాలితో రాసలీలలు సాగిస్తున్న సమయంలో తన కొడుకు చూశాడని, ఈ విషయం అందరికి చెబుతాడని భయపడిన తల్లి ఆమె కన్న కొడుకుని దారుణంగా హత్య చేసింది
కుమారుడిని హత్య చేసిన మహిళ పేరు శాంతా శర్మ అని పోలీసులు అన్నారు. శాంతా శర్మా అనే మహిళ స్వలింగ సంపర్కురాలు. తన స్నేహితురాలు ఇష్రత్ పర్వీన్తో ఆమెకు ఎఫైర్ ఉంది శాంతా శర్మా ఇంటికి ఇష్రత్ పర్వీన్ వెళ్లింది. శాంతా శర్మా, ఇష్రత్ పర్వీన్ ఇద్దరూ బెడ్ రూమ్ లో రాసలీలల్లో నిమగ్నమై ఉండగా వారిద్దరిని శాంతా శర్మా కొడుకు రెడ్ హ్యాండెడ్ గా చూశాడు. దీంతో శాంతా శర్మా, ఆమె ప్రియురాలు ఇష్రత్ పర్వీన్ కలిసి శాంతా శర్మా కొడుకును హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు.

హత్యకు గురైన 10 ఏళ్ల బాలుడి తలకు తీవ్ర గాయాలు అయ్యాయని, అతని చేతులు నరికివేశారని స్థానిక మీడియా తెలిపింది. స్థానిక మీడియా కథనం ప్రకారం సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి శాంతా శర్మా ఆమె భర్త, కుమారుడితో కలిసి నివాసం ఉంటోంది. శాంతా శర్మాకు ఇష్రత్ పర్వీన్తో అక్రమ సంబంధం ఉందని, ఇద్దరు స్వలింగసంపర్కులు అని ఆమె భర్తకు ఇంతకు ముందే తెలుసు అని పోలీసులు అంటున్నారు.
శాంతా శర్మా అదో టైపు అని ఆమె భర్తకు చాలా కాలం క్రితమే ఈ విషయం తెలుసు అని, సమాజంలో పరువుపోతుందని భయంతో శాంతా శర్మా ఆ విషయం బయట ఎవ్వరికి చెప్పకుండా సైలెంట్ గా ఉన్నాడని పోలీసులు తెలిపారు. అయితే శాంతా శర్మా, ఇష్రత్ పర్వీల అక్రమ సంబంధం విషయం ఆమె పదేళ్ల కుమారుడికి అనుకోకుండా తెలిసిందని, తన కుమారుడి కారణంగా ఇతరులకు మా విషయం తెలిసిపోతుందని శాంతా శర్మా భయపడిందని పోలీసులు అన్నారు.
శాంత శర్మా ఆమె స్వలింగసంపర్కుల సంబంధాన్ని కప్పిపుచ్చే ప్రయత్నంలో ఆమె స్వలింగ సంపర్క భాగస్వామి ఇష్రత్ పర్వీన్తో కలిసి తన కుమారుడిని హత్య చేసిందని పోలీసులు తెలిపారు.
అయితే విచిత్రం ఏంటంటే భార్యకు ఉన్న ఈ అనైతిక స్వలింగ సంపర్కం శాంత శర్మా భర్తకు కూడా తెలుసు అని, సమాజంలో తన పరువు పోతుందనే భయంతో దీనిపై ఆయన మౌనం వహించాడని స్థానిక మీడియా తెలిపింది.

సీసీటీవీలో నిందితులు శాంతా శర్మా, పర్వీన్ కలిసి మైన్ బాలుడిని హత్య చేసినట్లు ఆధారాలు లభించాయని పోలీసులు అన్నారు.బాలుడి హత్య కేసు నమోదు చేసిన పోలీసులు పలుకోణాల్లో విచారణ చేశారు. శాంతా శర్మా ఇంటి పరిసర ప్రాంతాల్లోని సీసీటీవీలను పరిశీలించి, మొబైల్ లొకేషన్లను పరిశీలించారు. ఈ సమయంలో వారిద్దరి మొబైల్ లొకేషన్లు బాలుడి హత్య జరిగిన ప్రాంతంలోనే ఉన్నట్లు పోలీసుల విచారణలో తెలిసింది.
పోలీసులు శాంతా శర్మా, ఆమె గర్ల్ ఫ్రెండ్ ఇష్రత్ పర్వీన్ ను అదుపులోకి తీసుకుని విచారణ చెయ్యగా బాలుడిని తామే హత్య చేశామని ఒప్పుకున్నారని పోలీసు అధికారులు తెలిపారు.
అదే విధంగా ఉత్తరప్రదేశ్లోని లఖింపూర్ కేరీలో మరో కేసులో 27 ఏళ్ల స్వలింగ సంపర్కుడి చేతిలో మాంత్రికుడు హత్యకు గురయ్యాడు. షాజన్పూర్కు చెందిన ఈ మహిళ కాలేజీలో చదువుతున్నప్పుడు పరిచయమైన యువతితో సంబంధం పెట్టుకుంది. మాంత్రికుడు ఆమె లింగాన్ని మారుస్తానని హామీ ఇచ్చాడు. తరువాత ఆమె చేతిలో ఆ మాంత్రికుడు హత్యకు గురైనాడు.
-
పీఎం కిసాన్ - అన్నదాత సుఖీభవ నిధుల జమ: ఖాతాల్లో రూ 6 వేలు, తాజా నిర్ణయం..!! -
మోదీ కేబినెట్ లోకి జనసేన, ఏపీలో బీజేపీకి మరో మంత్రి పదవి - ఆయనకే ఛాన్స్..!! -
మందుబాబులకు కిక్ ఇచ్చే కబురు- ఏప్రిల్ 1 నుండి.. -
విజయ్, త్రిష పెళ్లి డేట్ ఫిక్స్.. ఎన్నికలకు ముందే..!! -
T20 World Cup Final: అచ్చిరాని స్టేడియంలో కివీస్ తో ఫైనల్-పిచ్ లో కీలక మార్పు..! -
T20 WC 2026 ఫైనల్ గెలిచేది ఆ జట్టే: మహమ్మద్ అమీర్ -
T20 World Cup: భారత్ కు అదే మైనస్, మాకు ప్లస్-ఫైనల్ పై తేల్చేసిన కివీస్ కెప్టెన్..! -
H1B Visa న్యూ రూల్- గుడ్ న్యూస్ -
140 కోట్ల మంది కలలు ఛిద్రం.. ప్రపంచ కప్ నుంచి భారత్ అవుట్! -
విజయ్ నన్ను రోడ్డున పడేశాడు: మళ్లీ కోర్టుకెక్కిన సంగీత -
వారానికో సూపర్ హిట్ సినిమా ఎలా ఇస్తావ్ అన్నా..! -
today rashiphalalu: మీనరాశిలో శనిశుక్రుల బలమైన సంయోగంతో వీరికి జాక్ పాట్!












Click it and Unblock the Notifications