Viral Video: రోడ్డుపై అర్ధరాత్రి.. ఇదేం పని.. వీడియో వైరల్..
అర్ధరాత్రి రోడ్డుపై ఓ యువతి, యువకుడు హల్ చల్ చేశారు. ఓ పాటకు చిందులేస్తూ ఎంజాయి చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వీరు ఓ తమిళ పాటకు స్టెప్పులేశారు. వారు డ్యాన్స్ చేస్తున్నప్పుడు బిల్డింగ్ పైన ఉన్న ఎవరో వీడియో తీశారు.
ఈ వీడియోను మహేశ్వరి అనే మహిళ ట్వట్టర్ లో పోస్ట్ చేశారు. దీంతో ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ వీడియోకు ఇప్పటి వరకు 40 వేలకు పైగా వ్యూస్ వచ్చాయి. 25 వందలకు పైగా లైక్స్ రాగా.. 100కు పైగా రీట్వీట్లు చేశారు. ఈ వీడియో ఎక్కడ తిశారో వివరాలు తెలియలేదు.
ఈ వీడియోపై నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నారు. వారు తాగి డ్యాన్స్ చేస్తున్నారని ఒకరు కామెంట్ చేయగా. ఆ డ్యాన్స్ ఏదో స్టేజిపై చేస్తే డబ్బులు వచ్చేవని మరొకరు కామెంట్ చేశారు. వారు డ్యాన్స్ చేయడం వారి ఇష్టమని ఇంకొకరు కామెంట్ చేశారు. వారు డ్యాన్స్ బాగా చేశారమని మరికొందరు కామెంట్ చేశారు.
This ❤️🫶🏻 pic.twitter.com/msaur0JvyF
— Prerna Maheshwari (@prernadaga21) September 5, 2022