Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ఒక్క ఓటు రూ 1.50 లక్ష ఖర్చు, లండన్ నుంచి వచ్చిన సోనిక, అదే రూటులో లిఖిత, జీవిత, తనుశ్రీ!

ఓటు వేయడం మన హక్కు, ప్రజాస్వామ్య మనుగడ కోసం ఓటు వేయాలని ప్రభుత్వ అధికారులు అవగాహన కల్పిస్తున్నారు. ఓ యువతి తన ఓటు హక్కును వినియోగించుకునేందుకు వేల కిలోమీటర్లు ప్రయాణించింది. కర్ణాటకలోని మండ్యలోని కలేనహళ్లికి చెందిన సోనిక లోక్‌సభ ఎన్నికల్లో ఓటు వేయడానికి లండన్ నుంచి మండ్యకు రావడం హాట్ టాపిక్ అయ్యింది

కాలేనహళ్లిలో ఓటు వేసిన అనంతరం సోనిక ఆమె కుటుంబ సభ్యులతో కలిసి ఇంటికి వెళ్లింది. లండన్ నుంచి ఓటు వెయ్యడానికి ఇంత దూరం ప్రయాణించిన సోనిక ఆమె మనసులోని మాటలు అందరిని ఆలోచించేలా చేస్తున్నాయి. ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని, ఓటింగ్ ద్వారా కర్ణాటక రాష్ట్రంలో, దేశాభివృద్ధి కోసం ఉత్తమమైన అభ్యర్థిని ఎన్నుకోవాలని ప్రజలకు మనవి చేశారు.

A young woman who came from London and voted after spending one and a half lakh rupees

దేశంలో మునుపెన్నడూ లేని పరిస్థితి నెలకొందని, ప్రజలు అనేక ఇబ్బందులకు గురవుతున్నారని సోనిక అభిప్రాయం వ్యక్తం చేశారు. ఈ సమస్యలు తొలగిపోవాలంటే ఓటింగ్ ద్వారా మంచి అభ్యర్థులను ఎంపిక చేయాలని సోనిక అన్నారు. ఓటు ప్రాముఖ్యతపై మా అన్న నాకు అవగాహన కల్పించడంతో లండన్ నుంచి ఇక్కడికి వచ్చి ఓటు వేశానని సోనిక అన్నారు. మీరు మండ్య వచ్చి ఓటు వేయాలని తన అన్నతో పాటు కుటుంబ సభ్యులు తనకు సూచించారని సోనిక అన్నారు.

లండన్ నుంచి మండ్యకు వచ్చి ఓటు వెయ్యడానికి సోనికకు లక్షన్నర రూపాయలు ఖర్చు అయ్యిందని తెలుసుకుని స్థానికులు షాక్ అయ్యారు. తాను లోక్ సభ ఎన్నికల్లో ఓటు వేసేందుకు లండన్ నుంచి వచ్చానని, ఇందుకోసం లక్షన్నర ఖర్చు చేశానని సోనిక తెలిపింది. సొంతఊరిలోని తన ఇంటికి తాను ఇప్పట్లో వచ్చే ఆలోచన లేదని, అయితే లోక్ సభ ఎన్నికలు జరుగుతున్న సందర్బంగా తాను కేవలం ఓటు వేసేందుకు ఇంతదూరం వచ్చానని సోనిక చెప్పారు.

ఇలాగే ఆస్ట్రేలియా నుండి ఓటు వేయండి దంపతులు వారి పిల్లలతో కలిసి బెంగళూరు రావడం హాట్ టాపిక్ అయ్యింది. ఓవ్యక్తి అతని కుటుంబంతో సహా ఆస్ట్రేలియా నుండి బెంగళూరు వచ్చి దేశ ప్రజాస్వామ్య పండుగలో పాల్గొని బెంగళూరులో ఓటు వేశారు. విద్యారణ్యపురలోని తిండ్లుకు చెందిన సుధీంద్ర కులకర్ణి, ఆయన భార్య, పిల్లలతో కలిసి ఆస్ట్రేలియాలో స్థిరపడ్డాడు. సుధీంద్ర ఆయన భార్య విజయ మాల తిండ్లులోని తిండ్లులోని ఏపీసీ లేఅవుట్‌లో ఓటు వేశారు.

A young woman who came from London and voted after spending one and a half lakh rupees

వ్యాపారం నిమిత్తం చాలాకాలంగా దుబాయ్‌లో నివాసం ఉంటున్న అబ్దుల్ సుబాన్ ఓటు వేసేందుకు కోలార్‌కు వచ్చి ఓటు వేశారు. జీవిత అనే మహిళ కూడా దుబాయ్ నుంచి మంగళూరు వచ్చి తన ఓటు హక్కులను వినియోగించుకుంది. ఓటు వేయడానికి వేల కిలోమీటర్ల నుంచి వచ్చి ఓటు వేస్తున్నారు. అయితే ఇక్కడే ఉండి ఓటు వేయని ఎంతో మందికి ఇలాంటి వాళ్లు ఆదర్శంగా నిలుస్తున్నారు.

చిక్కమగళూరులోని కడూర్ తాలూకాలోని పంచెనహళ్లి గ్రామానికి చెందిన సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ మధు, ఆయన భార్య తనుశ్రీ కూడా దుబాయ్ నుంచి వచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు

కర్ణాటకలోని చిత్రదుర్గ టీచర్స్ కాలనీకి చెందిన లిఖితి ఫిలిప్పీన్స్ నుంచి వచ్చి ఓటు వేశారు. ఫిలిప్పీన్స్‌లో ఎంబీబీఎస్‌ చదువుతున్న లిఖిత లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో ఓటు వేసేందుకు సొంత ఊరుకు వచ్చింది. చిత్రదుర్గలోని జోగి మట్టి రోడ్డులోని పోలింగ్ బూత్ లో లిఖిత ఓటు వేసింది. ఇలా విదేశాల్లో ఉన్న చాలా మంది సొంత ఊర్లకు వచ్చి ఓటు వేస్తున్నారు. అయితే బెంగళూరులో నివాసం ఉంటున్న చాలా మంది సాఫ్ట్ వేర్ ఇంజనీర్లు ఓటు వెయ్యకుండా వీకెండ్ లో ఎంజాయ్ చెయ్యడానికి వెళ్లిపోయారని వెలుగు చూసింది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+