బిజెపితోనే పోటీ: అరవింద్ కేజ్రీవాల్, 400 సీట్లపై కన్ను

400 సీట్లలో పోటీ
2014 సార్వత్రిక ఎన్నికలలో దాదాపు నాలుగు వందల లోకసభ స్థానాలలో పోటీ చేయాలని ఎఎపి భావిస్తోంది. తొలుత ఆ పార్టీ రెండు వందల స్థానాల పైన దృష్టి సారించింది. అయితే, పార్టీకి ప్రజల నుండి, ప్రముఖుల నుండి అనూహ్య మద్దతు లభిస్తోంది. దీంతో నాలుగు వందల స్థానాలలో పోటీ చేయాలని భావిస్తోంది. తాము 400 స్థానాలలో పోటీ చేసే విషయమై ఆలోచిస్తున్నామనని ఎఎపి నేత ప్రశాంత్ భూషణ్ మంగళవారం అన్నారు.
ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ (ఎఎపి) కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్, కాంగ్రెసు పార్టీ సీనియర్ నేత కపిల్ సిబాల్లు ఒకరినొకరు ఆప్యాయంగా పలకరించుకున్నారు. మంగళవారం మిలాద్ ఉన్ నబీ సందర్భంగా కేజ్రీవాల్, సిబాల్లు ఢిల్లీ ప్రార్థనాలయంలో కలుసుకొని అప్యాయంగా పలకరించుకొని, హత్తుకున్నారు.












Click it and Unblock the Notifications