కేజ్రీకి మరో తలనొప్పి: ఉల్లి స్కాంపై ఏసిబి విచారణ
ఢిల్లీ: ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రివాల్కు కొత్త తలనొప్పి వచ్చింది. రాష్ట్రంలో ఉల్లి కుంభకోణం జరిగినట్లు వస్తున్న ఆరోపణల నేపథ్యంలో.. ఇందులో ఢిల్లీ ప్రభుత్వం పాత్రపై అవినీతి నిరోధక శాఖ(ఏసిబి) విచారణకు సిద్ధమైంది. ప్రభుత్వం తక్కువ ధరకు ఉల్లిని కొనుగోలు చేసి.. ప్రజలకు ఎక్కువ ధరలకు అమ్మిందనే ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో ఈ విచారణ జరుగుతోంది.
ఓ ఐపీఎస్ అధికారి నేతృత్వంలో ఐదుగురు సభ్యుల బృందంతో కూడిన ఏసిబి బృందం ఉల్లి కుంభకోణంపై దర్యాప్తు జరపనుంది. సమాచార కార్యకర్త వివేక్ గార్గ్ ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వంపై చేసిన ఆరోపణలు నేపథ్యంలో ఏసిబి విచారణ జరుపుతోంది.
కేజ్రివాల్ ప్రభుత్వం రూ. 18కి కిలో ఉల్లిని కొనుగులో చేసి.. దానికి రెట్టింపు ధర రూ. 30కి కిలో ఉల్లిని ప్రజలకు అమ్మిందని ఆయన ఆరోపించారు. ఇదే ధరకు అమ్ముతూ సబ్సిడీతోనే అందజేస్తున్నట్లు ప్రభుత్వం చెప్పుకుందని ఆయన చెప్పారు.

పత్రికల్లో రూ. 18కే కిలో ఉల్లిని అందజేస్తున్నట్లు ప్రకటనలిచ్చిన ప్రభుత్వం.. ఇందుకు విరుద్ధంగా రెట్టింపు ధరకు అమ్మిందని ఆరోపించారు. ప్రభుత్వం పత్రికల్లో ప్రకటనల కోసమే రూ. 23లక్షలు ఖర్చు చేసిందని విమర్శించారు.
కాగా, తమ ప్రభుత్వంపై కొందరు పనిగట్టుకుని అసత్య ఆరోపణలు చేస్తున్నారని ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రివాల్, డిప్యూటీ సిఎం మనీష్ సిసోడియా అన్నారు. తాము ఏ విచారణకైనా సిద్ధమేనని మనీష్ సిసోడియే చెప్పారు.
-
పవన్ కళ్యాణ్ కొత్త మూవీలో "రౌడీ హీరో".. బాక్సాఫీస్ షేక్ పక్కా !! -
ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లో వండిన అన్నం తింటున్నారా- ఇది తెలుసుకోవాల్సిందే..!! -
కోటి 15 లక్షల మంది మహిళలకు రేవంత్ రెడ్డి వరాలు -
ఎల్లుండే.. `ఉస్తాద్..` ఫ్యాన్స్ కు పండగ -
మంత్రులు సిద్దంగా ఉండాలి, ముహూర్తం ఫిక్స్ - తేల్చి చెప్పిన చంద్రబాబు..!! -
భారత్ లో గ్యాస్ కొరతపై ఐదు నెలల ముందే చెప్పిన జ్యోతిష్యుడు ప్రశాంత్ కిని -
పెట్రోల్, డీజిల్ ధరల బాంబు- కమింగ్ సూన్ -
ఇరాన్ సుప్రీం లీడర్ కు నో లైఫ్ గ్యారెంటీ- మట్టుబెట్టడం తథ్యం: నెతన్యాహు శపథం -
బీజేపీతో విజయ్ పొత్తు? తమిళ రాజకీయాల్లో ఊహించని ట్విస్ట్! -
ఉస్తాద్ భగత్ సింగ్ నిర్మాతలకు బిగ్ రిలీఫ్- ఏకంగా సుప్రీంకోర్టు స్టే -
AP Govt: ఏపీలో వారసత్వ భూముల రిజిస్ట్రేషన్ ఇక సులువు-తాజా రూల్స్..! -
చిన్నమ్మ పార్టీ, పేరు, జెండా, అజెండా వెల్లడి












Click it and Unblock the Notifications