మీటర్ పని చేయకుండా చేసి కరెంట్ బిల్లు ఎగ్గొట్టిన నటి, కేసు
నటి అగ్నిహోత్రి, ఆమె భర్త పైన విద్యుత్ చౌర్యం కేసు నమోదయింది. అంతేకాదు, వారు గత మూడేళ్లుగా రూ.49.98 వేల బిల్లును ఎగ్గొట్టారు.
ముంబై: నటి అగ్నిహోత్రి, ఆమె భర్త పైన విద్యుత్ చౌర్యం కేసు నమోదయింది. అంతేకాదు, వారు గత మూడేళ్లుగా రూ.49.98 వేల బిల్లును ఎగ్గొట్టారు. తన భర్త అనిల్ వీర్వానితో కలిసి ముంబైలోని వోర్లి రెసిడెన్సీలో ఉంటున్నారు.
చాలా కాలంపాటు ఫ్లాట్లో విద్యుత్ మీటర్ను పని చేయకుండా చేసి పెద్ద మొత్తంలో కరెంటు బిల్లు ఎగ్గొట్టారు. కొంతకాలంగా రతి ఇంటి నుంచి కరెంటు బిల్లు సరిగ్గా రాకపోవడంతో బీఈఎస్టీ (బృహన్ ముంబై ఎలక్ట్రిసిటీ సప్లై అండ్ ట్రాన్స్పోర్ట్) అధికారులు గురువారం ఇంటికి వచ్చి తనిఖీ చేయగా విషయం వెలుగు చూసింది.
ఇండియన్ను, ఏం మీరు ట్రంప్కు భయపడుతున్నారా: ప్రియాంక చోప్రా
రతి దంపతులు 2013 ఏప్రిల్ 4 నుంచి 1,77,647 యూనిట్ల విద్యుత్ను ఉచితంగా వాడుకున్నట్లు ఓ ఇంజినీర్ గమనించి అధికారులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు వారి పైన సెక్షన్ 135 కింద కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.