92ఏళ్ళ తర్వాత సాధారణ బడ్జెట్ లోనే రైల్వేబడ్జెట్,ఎందుకిలా...
92 ఏళ్ళ తర్వాత రైల్వే బడ్జెట్ ను సాధారణ బడ్జెట్ లో కలిపి కేంద్రం ప్రవేశపెడుతోంది. సంస్కరణల్లో భాగంగా కేంద్రం ఈ నిర్ణయం తీసుకొంది.
న్యూఢిల్లీ:రైల్వే బడ్జెట్, సాధారణ బడ్జెట్ లను వేర్వేరుగా ప్రవేశపెట్టే సంప్రదాయాలకు కేంద్ర ప్రభుత్వం స్వస్తిపలికింది. 92 ఏళ్ళ తర్వాత రైల్వే బడ్జెట్ ను సాధారణ బడ్జెట్ లోనే కలిపి ప్రవేశపెడుతోంది.ఇక నుండి రైల్వేకు ప్రత్యేకంగా బడ్జెట్ ను ప్రవేశపెట్టే సంప్రదాయానికి తెరపడింది.
రైల్వే బడ్జెట్, సాధారణ బడ్జెట్ లు వేర్వేరుగా ప్రవేశపెట్టేవారు. ఈ సంప్రదాయం దాదాపుగా 92 ఏళ్ళ క్రితం ప్రారంభమైంది.
92 ఏళ్ళ క్రితం భారత్ ను బ్రిటిష్ వారు పాలించే సమయంలో సాధారణ బడ్జెట్ , రైల్వే బడ్జెట్ వేర్వేరుగా ప్రవేశపెట్టడం ప్రారంభమైంది. 1924 లో వేర్వేరుగా బడ్జెట్ లను ప్రవేశపెట్టే సంప్రదాయం ప్రారంభమైంది.
పారిశ్రామిక సంపద బడ్జెట్ లో 75 నుండి 85 శాతం కేటాయింపులు ఉంటాయి. జనరల్ బడ్జెట్ లో రైల్వేలు ఎక్కువ స్థానాన్ని ఆక్రమించుకొనేవి. అయితే వేర్వేరుగా బడ్జెట్ లు ప్రవేశపెట్టాలని బ్రిటిష్ అధికారులు ప్రతిపాదించారు.

పదిమంది సభ్యులున్న అక్వర్త్ కమిటీ 1920 -21 లో ఈ ప్రతిపాదనను తెచ్చారు. అనంతరం 1924 లో దీన్ని సాధారణ బడ్జెట్ నుండి విడదీశారు.
దీని ద్వారా మంచి విధాన రూపకల్పన అమలు చేసే అవకాశం ఉందని భావించారు.ఆనాటి నుండి రెండు బడ్జెట్ లు వేర్వేరుగా పార్లమెంట్ లో ప్రవేశపెట్టే సంప్రదాయం వచ్చింది.
ప్రస్తుతం సాధారణ బడ్జెట్ లో రైల్వేలో కలిగింది కేవలం నాలుగు శాతం మాత్రమే. దీంతో పాటుగా రైల్వే తీవ్ర నష్టాలను భరించాల్సివస్తోంది.
దీంతో రైల్వే బడ్జెట్ ను సాధారణ బడ్జెట్ ను కలపాలని కేంద్రం నిర్ణయించింది.ఈ మేరకు 92 ఏళ్ళ తర్వాత తొలిసారిగా ఈ రెండుబడ్జెట్ లను కలిపి కేంద్రం ప్రవేశపెడుతోంది.
అయితే సాధారణ బడ్జెట్ ను ప్రత్యక్ష ప్రసారం చేసే పద్దతి కొనసాగుతోంది.అయితే 1994 నుండి రైల్వే బడ్జెట్ ను కూడ ప్రత్యక్ష ప్రసారం చేయడం ప్రారంభించారు.
స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత తొలిసారిగా రైల్వేశాఖ మంత్రి జాన్ మతాయి గా రికార్డులకెక్కారు. మొదటి మహిళా రైల్వే శాఖ మంత్రిగా మమత బెనర్జీ చరిత్రలో నిలిచారు.
-
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, అసలు సమస్య - ఇలా చేయండి..!! -
Vijay: ఎంజీఆర్, జయలలిత చేయని సాహసం చేస్తున్న విజయ్? డీఎంకే కంచుకోటలో..! -
INS Aridhaman: ప్రళయ కాల రుద్రుడు, నీటి అడుగున భారత్ విశ్వరూపం.. -
బీఆర్ఎస్ లో చేరిక పై తేల్చేసిన జీవన్ రెడ్డి, వాట్ నెక్స్ట్..!! -
ఉద్యోగులకు కూటమి ప్రభుత్వం భారీ గుడ్న్యూస్ -
నయనతార బ్రేకప్ వెనుక అసలు రహస్యం.. ప్రభుదేవా ఆ ఒక్క కండీషన్ వల్లే? -
విశాఖ రైల్వే జోన్ పరిధిలో కీలక మార్పులు, ప్రధాన మార్గం విలీనం..!! -
అదే గానీ జరిగితే.. పాకిస్థాన్కు రాజ్నాథ్ సింగ్ స్ట్రాంగ్ వార్నింగ్.. -
వివాహేతర సంబంధాల్లో రెండో స్థానంలో హైదరాబాద్.. తాజా సర్వేలో.. -
వాస్తు ప్రకారం.. ఇంట్లో ఈ మొక్కలు పెరుగుతూ ఉంటే సంపద పెరుగుతూ ఉంటుంది -
ఇళ్ళస్థలాలు లేనివారికి రేవంత్ సర్కార్ శుభవార్త.. రాష్ట్రవ్యాప్తంగా త్వరలోనే.. -
ఇండియాలో ఫస్ట్ టైమ్ సెల్ఫ్ క్లీనింగ్ ఏసీ.. 10 సెకన్లలోనే కూలింగ్ !!












Click it and Unblock the Notifications