92ఏళ్ళ తర్వాత సాధారణ బడ్జెట్ లోనే రైల్వేబడ్జెట్,ఎందుకిలా...
92 ఏళ్ళ తర్వాత రైల్వే బడ్జెట్ ను సాధారణ బడ్జెట్ లో కలిపి కేంద్రం ప్రవేశపెడుతోంది. సంస్కరణల్లో భాగంగా కేంద్రం ఈ నిర్ణయం తీసుకొంది.
న్యూఢిల్లీ:రైల్వే బడ్జెట్, సాధారణ బడ్జెట్ లను వేర్వేరుగా ప్రవేశపెట్టే సంప్రదాయాలకు కేంద్ర ప్రభుత్వం స్వస్తిపలికింది. 92 ఏళ్ళ తర్వాత రైల్వే బడ్జెట్ ను సాధారణ బడ్జెట్ లోనే కలిపి ప్రవేశపెడుతోంది.ఇక నుండి రైల్వేకు ప్రత్యేకంగా బడ్జెట్ ను ప్రవేశపెట్టే సంప్రదాయానికి తెరపడింది.
రైల్వే బడ్జెట్, సాధారణ బడ్జెట్ లు వేర్వేరుగా ప్రవేశపెట్టేవారు. ఈ సంప్రదాయం దాదాపుగా 92 ఏళ్ళ క్రితం ప్రారంభమైంది.
92 ఏళ్ళ క్రితం భారత్ ను బ్రిటిష్ వారు పాలించే సమయంలో సాధారణ బడ్జెట్ , రైల్వే బడ్జెట్ వేర్వేరుగా ప్రవేశపెట్టడం ప్రారంభమైంది. 1924 లో వేర్వేరుగా బడ్జెట్ లను ప్రవేశపెట్టే సంప్రదాయం ప్రారంభమైంది.
పారిశ్రామిక సంపద బడ్జెట్ లో 75 నుండి 85 శాతం కేటాయింపులు ఉంటాయి. జనరల్ బడ్జెట్ లో రైల్వేలు ఎక్కువ స్థానాన్ని ఆక్రమించుకొనేవి. అయితే వేర్వేరుగా బడ్జెట్ లు ప్రవేశపెట్టాలని బ్రిటిష్ అధికారులు ప్రతిపాదించారు.

పదిమంది సభ్యులున్న అక్వర్త్ కమిటీ 1920 -21 లో ఈ ప్రతిపాదనను తెచ్చారు. అనంతరం 1924 లో దీన్ని సాధారణ బడ్జెట్ నుండి విడదీశారు.
దీని ద్వారా మంచి విధాన రూపకల్పన అమలు చేసే అవకాశం ఉందని భావించారు.ఆనాటి నుండి రెండు బడ్జెట్ లు వేర్వేరుగా పార్లమెంట్ లో ప్రవేశపెట్టే సంప్రదాయం వచ్చింది.
ప్రస్తుతం సాధారణ బడ్జెట్ లో రైల్వేలో కలిగింది కేవలం నాలుగు శాతం మాత్రమే. దీంతో పాటుగా రైల్వే తీవ్ర నష్టాలను భరించాల్సివస్తోంది.
దీంతో రైల్వే బడ్జెట్ ను సాధారణ బడ్జెట్ ను కలపాలని కేంద్రం నిర్ణయించింది.ఈ మేరకు 92 ఏళ్ళ తర్వాత తొలిసారిగా ఈ రెండుబడ్జెట్ లను కలిపి కేంద్రం ప్రవేశపెడుతోంది.
అయితే సాధారణ బడ్జెట్ ను ప్రత్యక్ష ప్రసారం చేసే పద్దతి కొనసాగుతోంది.అయితే 1994 నుండి రైల్వే బడ్జెట్ ను కూడ ప్రత్యక్ష ప్రసారం చేయడం ప్రారంభించారు.
స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత తొలిసారిగా రైల్వేశాఖ మంత్రి జాన్ మతాయి గా రికార్డులకెక్కారు. మొదటి మహిళా రైల్వే శాఖ మంత్రిగా మమత బెనర్జీ చరిత్రలో నిలిచారు.
-
పవన్ కళ్యాణ్ కొత్త మూవీలో "రౌడీ హీరో".. బాక్సాఫీస్ షేక్ పక్కా !! -
ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లో వండిన అన్నం తింటున్నారా- ఇది తెలుసుకోవాల్సిందే..!! -
కోటి 15 లక్షల మంది మహిళలకు రేవంత్ రెడ్డి వరాలు -
ఎల్లుండే.. `ఉస్తాద్..` ఫ్యాన్స్ కు పండగ -
మంత్రులు సిద్దంగా ఉండాలి, ముహూర్తం ఫిక్స్ - తేల్చి చెప్పిన చంద్రబాబు..!! -
భారత్ లో గ్యాస్ కొరతపై ఐదు నెలల ముందే చెప్పిన జ్యోతిష్యుడు ప్రశాంత్ కిని -
పెట్రోల్, డీజిల్ ధరల బాంబు- కమింగ్ సూన్ -
ఇరాన్ సుప్రీం లీడర్ కు నో లైఫ్ గ్యారెంటీ- మట్టుబెట్టడం తథ్యం: నెతన్యాహు శపథం -
బీజేపీతో విజయ్ పొత్తు? తమిళ రాజకీయాల్లో ఊహించని ట్విస్ట్! -
ఉస్తాద్ భగత్ సింగ్ నిర్మాతలకు బిగ్ రిలీఫ్- ఏకంగా సుప్రీంకోర్టు స్టే -
AP Govt: ఏపీలో వారసత్వ భూముల రిజిస్ట్రేషన్ ఇక సులువు-తాజా రూల్స్..! -
చిన్నమ్మ పార్టీ, పేరు, జెండా, అజెండా వెల్లడి












Click it and Unblock the Notifications