సయీద్తో పోలిక: షారుక్పై బీజేపీ ఎంపీ సంచలనం
ముంబై: మత అసహనంపై షారుక్ చేసిన వ్యాఖ్యలపై బీజేపీ నేతల ఎదురుదాడి మరింతగా పెరిగింది. తొలుత సాధ్వీ ప్రాచి షారూక్ను తప్పుబట్టగా, ఆ తర్వాత బీజేపీ సీనియర్ నేత, ఆ పార్టీ కార్యదర్శి కైలాష్ విజయ్ వర్గియా ట్విట్టర్లో తీవ్ర విమర్శలు చేశారు.
ఇప్పుడు తాజాగా బీజేపీ ఎంపీ యోగి ఆదిత్య నాథ్ షారుక్పై ఘాటు విమర్శలు చేశారు. షారుక్ ఖాన్ను ఏకంగా పాకిస్థాన్ ఉగ్రవాద సంస్థ జమాత్ ఉద్ దవా చీఫ్ హఫీజ్ సయీద్తో పోల్చి చెప్పారు. వారిద్దరి భాష ఒకటేనంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.

'షారుక్ ఖాన్ భాషకు హఫీజ్ సయీద్ భాషకు పెద్దగా తేడా ఏమిలేదు. మనం షారుక్ సినిమాలను బ్యాన్ చేయాలని, చూడటం ఆపేయాలని అనుకున్న ప్రతిసారి ముస్లింల మాదిరిగానే సయీద్ కూడా రోడ్లపైకి వస్తాడు' అని ఆదిత్యనాథ్ అన్నారు. కాగా, యోగి ఆదిత్యనాథ్ వ్యాఖ్యలతో పార్టీకి ఎలాంటి సంబంధం లేదని, ఆ వ్యాఖ్యలు అతడి వ్యక్తిగతమని, పార్టీ ఆ మాటలతో ఏకీభవించబోదని బీజేపీ అధికార ప్రతినిథి నలిన్ కోహ్లీ వివరణ ఇచ్చారు.
కాగా, మంగళవారం "షారూక్ ఖాన్ ఇండియాలో ఉంటాడు. ఆయన మనసు మాత్రం పాకిస్థాన్ లో ఉంటుంది. ఆయన సినిమాలు ఇక్కడ కోట్ల రూపాయలను వసూలు చేస్తున్నాయి. అయినా, ఆయన భారత్ లో అసహనాన్ని వెతుకుతున్నారు" అని బీజేపీ జనరల్ సెక్రటరీ కైలాశ్ విజయ్వర్గియా ట్వీట్ చేశారు.
దీంతో కైలాశ్ విజయ్వర్గియా వ్యాఖ్యలపై మరో బీజేపీ నేత ప్రకాష్ జవదేకర్ మండిపడ్డారు. ఆయన వ్యాఖ్యలను ఖండిస్తున్నట్టు తెలిపారు. దీంతో షారుక్పై తాను చేసిన వ్యాఖ్యలను కొందరు అపార్థం చేసుకున్నారని, అందుకే ఆ ట్వీట్లను తొలగిస్తున్నానని బీజేపీ సీనియర్ నేత కైలాశ్ విజయ్వార్గియా తెలిపారు.
విజయ్వార్గియా టిట్టర్లో చేసిన ఈ వ్యాఖ్యలపై తీవ్ర దుమారం రేగింది. వివాదాస్పద వ్యాఖ్యలు చేయవద్దంటూ ఇటీవల పార్టీ నేతలకు ఆదేశాలు ఇచ్చిన బీజేపీ అధినాయకత్వం ఆయన వ్యాఖ్యలకు దూరం జరిగింది. ఈ నేపథ్యంలో షారుఖ్పై తన ట్వీట్లను వెనుకకు తీసుకుంటున్నట్టు బీజేపీ ప్రధాన కార్యదర్శి కైలాశ్ విజయ్వార్గియా తెలిపారు. ఎవరినీ గాయపర్చడం తన ఉద్దేశం కాదని, తన వ్యాఖ్యలను అపార్థం చేసుకున్నారని ట్విట్టర్లో పేర్కొన్నారు.
मेरा उद्देश्य किसी को भी ठेस पहुँचाना कतई नहीं था। मैं अपना कल का ट्वीट वापिस लेता हूँ। 2/2
— Kailash Vijayvargiya (@KailashOnline) November 4, 2015 अगर भारत में असहिष्णुता होती तो अमिताभ के बाद सर्वाधिक लोकप्रिय अभिनेता शाहरुख़ न होते, मेरे ट्वीट को कुछ लोगो ने अलग अर्थो में लिया है। 1/2
— Kailash Vijayvargiya (@KailashOnline) November 4, 2015 మరోవైపు షారూక్కు మద్దతుగా ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, తృణమూల్ కాంగ్రెస్ నేత డిరెక్ ఓ బ్రియన్ ట్వీట్స్ చేసిన సంగతి తెలిసిందే. కేరళ ముఖ్యమంత్రి ఉమెన్ చాందీ స్పందిస్తూ బాధ్యతరహితంగా చేసే ఇలాంటి వ్యాఖ్యలు దేశ ఐకమత్యాన్ని దెబ్బతీస్తుందని చెప్పారు.
We r all proud of you.@iamsrk Hope your words help to make a tolerant, inclusive and progressive India.
— Arvind Kejriwal (@ArvindKejriwal) November 3, 2015 మరోవైపు సమాజ్ వాదీ పార్టీ నేతలు బీజేపీ నేతలు చేసిన వ్యాఖ్యలపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. పార్టీ అధిష్టానం అనుమతి లేకుండా ఒక్కరు కూడా ఇలాంటి వ్యాఖ్యలు చేయబోరని ఇదంతా బీజేపీ వ్యూహాత్మక దాడి అని ఆ పార్టీ నేత గౌరవ భాటియా అన్నారు. ఇలాంటి వ్యాఖ్యలు చేయడం నిజంగా దురదృష్టకరమన్నారు.
-
బెంగాల్ టైగర్ ఎవరో తేల్చేసిన సర్వేలు.. దీదీ మళ్లీ సీఎం అవుతారా? -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565












Click it and Unblock the Notifications